ఇప్పటికే కరోనా వైరస్ మూలంగా ప్రపంచమంతా అల్లాడిపోతుంటే…. దీనంతటికీ కారణమైన చైనా వారు మరొక వ్యాధి కి శ్రీకారం చుట్టినట్లు రిపోర్టర్ వచ్చేశాయి. ఇప్పటికే కరోనా ధాటికి దాదాపు ప్రపంచ వ్యాప్తంగా ఐదు లక్షల మంది చనిపోగా ఇప్పుడు చైనాలో ఉద్భవించిన మరొక వ్యాధి వల్ల ఒక మనిషి దీని బారిన పడితే కేవలం 24 గంటల్లో చనిపోతారు అని డబ్ల్యూహెచ్వో ప్రకటించింది.
బ్యాక్టీరియా వల్ల కలిగే దీని పేరు ‘బుబోనిక్ ప్లేగ్’. ఎలుక లాగా కనిపించే ‘మర్మోట్’ అనే ఒక జీవచరం పై నివసించే ఒక రకమైన బ్యాక్టీరియా వలన ఈ వ్యాధి వస్తుంది. ప్రస్తుతం ఉత్తర చైనాలో ఈ వ్యాధి ప్రబలినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే శనివారం బయన్నూర్ లోని ఒక ఆసుపత్రిలో బుబోనిక్ ప్లేగ్ కేసు ఒకటి నమోదయినట్లు తెలుస్తోంది.
ఇకపోతే దీనికి సంబంధించి జూలై 1 న చైనా ప్రభుత్వ వార్తా సంస్థ వార్తలను ప్రకటించగా ప్రస్తుతం చైనా ప్రభుత్వం దేశంలో ఎవరిని మర్మోట్ మాంసాన్ని తినవద్దని హెచ్చరించింది. ఈ హెచ్చరిక 2020 చివరి వరకు కొనసాగుతుందని తెలిపింది. ఇంకా ఎవరికైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే వారు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని మరియు కరోనా కష్టకాలంలో ఈ బుబోనిక్ ప్లేగ్ అనేది మనుషుల మధ్య వ్యాపించే వ్యాధి కనుక ఇదీ ప్రబలితే ఇక దాని కన్నా పెద్దది నినాశనం మరొకటి ఉండదని వారు వాపోతున్నారు.
ప్రస్తుతానికి ప్లేగ్ వ్యాధి సంక్రమించిన వ్యక్తితో కాంటాక్ట్ లో ఉన్న 146 మందిని ఐసోలేట్ చేసి వారిని స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.