బంగారం మరియు వెండి ధరలు కనీసం సామాన్యుడికి కనుచూపు మేరలో లేకుండా దూసుకుపోతున్నాయి. రెండు వారాలకు పైగా పైపైకి ఎగబాకి పసిడి ధర దేశరాజధాని ఢిల్లీలో శుక్రవారం ఆల్ టైం హై కి చేరింది. 10 గ్రాముల పసిడి ఏకంగా 57,008 రూపాయలకు పెరిగింది. మరోవైపు వెండి ధర కూడా 576 రూపాయలు పెరిగి 78,840 రూపాయల దగ్గర నిలిచింది.
ఇక పసిడి ధర స్వల్పంగా పెరిగిన కూడా 16 సెషన్స్ లో వరుసగా పెరగడంతో తాజాగా సరికొత్త శిఖరాన్ని తాకింది. ఇది ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరగడం…. ఆర్థిక అనిశ్చితి ఏర్పడడంతో మదుపుదారులు బంగారంలో పెట్టుబడులకు మొగ్గు చూపడంతో బులియన్ మార్కెట్ లో ఈ వారం బంగారం స్థాయిలో భారీగా లాభపడింది అని రాయిటర్స్ పేర్కొంది.
ఇక రాబోయే రోజుల్లో కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడే పరిస్థితి లేకపోవడంతో బంగారంలో పెట్టుబడులకు ఇన్వెస్టర్లలో ఆసక్తి చూపుతారని… ఈ పెరుగుదల ఇలాగే కొనసాగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.