Chandrababu : వైఎస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో కొత్త పార్టీకి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకువస్తా, తెలంగాణలోనే చదువుకున్నా, తెలంగాణ కోడలిని అంటూ షర్మిల అక్కడ వైసిపి మద్దతుదారులతో ఆత్మీయులతో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాలు జిల్లాల వారీగా చేస్తూ తన పని తాను చేసుకు పోతుంది. ఇలాంటి తరుణంలో టీడీపీ అధినేత చంద్రబాబు షర్మిలపై వైరల్ కామెంట్ చేశారు.
కర్నూలు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. సీఎం జగన్ ని టార్గెట్ చేస్తూ ఆయన కుటుంబం పై వైరల్ కామెంట్ చేశారు. చంద్రబాబు ఏమన్నారు అంటే.. జగన్ బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డిని ఎవరు చంపారో, హత్య కేసులో ఎవరు దోషులు అన్నది ప్రజలకు తెలుసు అని వ్యాఖ్యానించారు. ఇక షర్మిల తెలంగాణలో రోడ్డున పడ్డారని, ఆమెకు ఆస్తులు ఇవ్వకుండా పదవులు కూడా ఇవ్వకుండా మోసం చేశారని చంద్రబాబు ఆరోపించారు.
దేశ వ్యాప్తంగా ఎక్కువ అప్పులు చేసిన ముఖ్యమంత్రి వైయస్ జగనే అని స్పష్టం చేశారు.దాదాపూర్ ఇరవై రెండు నెలల పరిపాలన కాలంలో లక్షా అరవై మూడు వేల కోట్ల రూపాయలు అప్పులు చేశారని, ప్రభుత్వ ఆస్తులను అమ్ముకునే పరిస్థితి కి పాలన మారింది అని మండిపడ్డారు. జగన్ ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోయారు నాటికి రాష్ట్రంపై నాలుగు లక్షల కోట్ల అప్పులు ఉంటాయని అంచనా వేశారు.
జగన్ చేస్తున్న అవినీతి వల్లే రాష్ట్రంలో అప్పులు పెరుగుతున్నట్లు పేర్కొన్నారు. ఏది ఏమైనా రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కర్నూలులో పాల్గొన్న చంద్రబాబు షర్మిల పై చేసిన కామెంట్లు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా మారింది.