Chiranjeevi : చిరంజీవి – రామ్ చరణ్ కలిసి ఆచార్య సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి ప్రాంతంలో శరవేగంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ తో పాటు చిత్ర యూనిట్ రాజమండ్రి చేరుకున్నారు. ఈ షెడ్యూల్ లో చిరంజీవి – చరణ్ పాల్గొనే ఓ యాక్షన్ సీక్వెన్స్ ని షూట్ చేయడానికి చిత్ర బృందం రెడీ అవుతున్నారు. ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్ – మాట్నీ మూవీస్ కలిసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ మెగాస్టార్ కి జంటగా నటిస్తోంది.
అలాగే రామ్ చరణ్ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాలో కూడా అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కొమరం భీం గా నటిస్తున్నాడు. బాలీవుడ్ సహ హాలీవుడ్ నటులు కూడా ఆర్.ఆర్.ఆర్ లో నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఆచార్య, ఆర్.ఆర్.ఆర్ సినిమాల రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు మేకర్స్. అందుకే రిలీజ్ డేట్ టార్గెట్ మిస్ కాకూడదని ఈ సినిమాల షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ కూడా కంప్లీట్ చేస్తున్నారు. రెండు సినిమాలు భారీ మల్టీ స్టారర్ లు కాబట్టి ఊహించని రీతిలో అంచనాలు ఏర్పడ్డాయి.
Chiranjeevi : చిరంజీవి – రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ‘ఆచార్య’ షూటింగ్ రాజమండ్రిలో జరగనుంది.
కాగా ఇక్కడ మరో విశేషం కూడా ఉంది. రీసెంట్ గా మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ నటించిన డెబ్యూ సినిమా ఉప్పెన రిలీజై సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకొని విజయ వంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ క్రమంలో రేపు రాజమండ్రిలో నిర్వహించబోతున్న సక్సస్ సెలెబ్రేషన్స్ కి చీఫ్ గెస్ట్ గా హాజరుకానున్నాడు. ఈ క్రమంలోనే ఒకవైపు ఆచార్య షూటింగ్ లో పాల్గొనేందుకు అలాగే ఉప్పెన సక్సస్ సెలెబ్రేషన్స్ కి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యేందుకు చరణ్ రాజమండ్రి చేరుకున్నాడు. చరణ్ నటించిన ‘రంగస్థలం’ మూవీ షూటింగ్ ఎక్కువ శాతం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోనే జరిగింది. అలాగే ఇప్పుడు చిరంజీవి – రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ‘ఆచార్య’ షూటింగ్ రాజమండ్రిలో జరగనుంది.