Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారో అందరికీ తెలిసిందే. ఖైదీ నంబర్ 150 మూవీతో రీ ఎంట్రీ ఇచ్చిన చిరు సైరా సినిమాతో పాన్ ఇండియన్ స్టార్గా మారారు. ఆ తర్వాత మెగాస్టార్ వరుసగా భారీ మాస్ ఎంటర్టైనర్స్ను కమిటయ్యారు. వాటిలో ఇప్పటికే ఆచార్య పూర్తి చేసిన మెగాస్టార్ ఆ సినిమాను ఏప్రిల్ 29న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేశారు. ఇక శరవేగంగా మూడు సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఇంతలో ఆయన రెండవసారి కరోనా బారిన పడ్డారు. ఫస్ట్ వేవ్లో కరోనాను ఎదుర్కొన్న చిరు మళ్ళీ ఇప్పుడు థర్డ్ వేవ్లోనూ కరోనా బారిన పడిన విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
ఇక సెల్ఫ్ క్వారంటైన్లో ఉంటూ డాక్టర్ల సలహాల మేరకు మందులు వాడారు. ఎట్టకేలకు తాజాగా చిరంజీవి జెస్ట్ చేయించుకోగా నెగిటివ్ వచ్చింది. అంతే, ఇక ఆగలేకపోయారు. ఎవరైనా కరోనా నెగిటివ్ వస్తే హమ్మయ్య అనుకొని ఇంకా కొన్నాళ్ళు ఇంటిపట్టునే ఉంటూ విశ్రాంతి తీసుకుంటారు. కానీ, మెగాస్టార్ మాత్రం నెగిటివ్ రాగానే తన దర్శకులకు డేట్స్ ఇచ్చేశారు. ముందుగా తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో చేస్తున్న గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్లో జాయిన్ అయ్యారు. మలయాళ హిట్ సినిమా రీమేక్గా ఇది రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్లో జాయిన్ అయిన విషయాన్ని మెగాస్టార్ సోషల్ మీడియా ద్వారా స్వయంగా వెల్లడించారు.
Chiranjeevi: మెగాస్టార్ను చూసి అందరూ షాకవుతున్నారు.
ఇక ఆయన సెట్లో జాయిన్ అయిన ఫొటోలను చిరంజీవి తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. ఇటీవలే ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న సౌత్ స్టార్ నయనతార తన పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకొని తిరిగి చెన్నై వెళ్ళారు. ఇక తాజాగా మెగాస్టార్ కరోనా నుంచి కోలుకొని షూటింగ్లో జాయిన్ అయ్యారు. అలాగే, దీని తర్వాత మెహర్ రమేశ్ తెరకెక్కుతున్న భోళా శంకర్ సినిమా షూటింగ్లోనూ..బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలోనూ పాల్గోనబోతున్నారు. ఇలా వరుసగా షెడ్యూల్స్ ప్లాన్ చేసుకోమని షూటింగ్కు హాజరవుతున్న మెగాస్టార్ను చూసి అందరూ షాకవుతున్నారు. కాగా, ఆయన టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన సమావేశంలోనూ పాల్గొనబోతున్నారు.