Dasara special : దసరా నవరాత్రులను ప్రజలు ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. అమ్మవారికి ఈ తొమ్మిది రోజుల్లో ఒక్కో రోజు ఒక్కో అలంకరణ చేసి వివిధ రకాల నైవేద్యాలను పెట్టి అమ్మవారి కృపకు పాత్రులు అవుతారు.అయితే ఈరోజు దసరా ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు రాజ రాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తారు. అలాగే ఈరోజు అమ్మవారికి బెల్లం, పాలతో చేసిన పరమాన్నంను అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. మరి ఈ పరమాన్నంను ఎలా తయారుచేయాలో చూద్దాం.
కావలిసిన పదార్ధాలు :
చిక్కటి పాలు – లీటర్
బియ్యం 1 కప్
బెల్లం -పావు కేజీ
జీడిపప్పు -1/4 కప్
ఏలకలుపౌడర్ -1/2 స్పూన్
నెయ్యి -5 టేబల్ స్పూన్స్
కిస్ మిస్ -1/4 కప్పు
సగ్గుబియ్యం-2టేబుల్ స్పూన్స్
తయారు చేసే విధానం :
ముందుగా ఒక గిన్నెలో బియ్యం, సగ్గుబియ్యాన్ని కడిగి ఒక అరగంట పాటు నానపెట్టుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టి అందులో నెయ్యి వేసి జీడిపప్పు, కిస్ మిస్ లను వేసి వేపుకుని పక్కన పెట్టుకోవాలి.ఇప్పుడు దట్టమైన వెడల్పాటి గిన్నెలో చిక్కటి పాలు, ఒక కప్ నీళ్లు పోసి కాగానివ్వాలి. పాలు పొంగు వచ్చాక నానపెట్టుకున్న బియ్యం, సగ్గుబియ్యంను వేయాలి.అన్నం బాగా మెత్తగా ఉడికిన తరువాత బెల్లంను వేసి ఐదు నిముషాల పాటు ఉంచాలి.ఇప్పుడు యాలకల పొడి కూడా వేసి పరమాన్నం చిక్కగా అయ్యాక. స్టవ్ ఆఫ్ చేసేయాలి.చివరగా వేపుకున్న జీడిపప్పు, కిస్ మిస్, ఒక స్పూన్ నెయ్యి వేయాలి.. అంతే ఎంతో రుచికరమైన,కమ్మని,తియ్యని పరమాన్నంను ఆ రాజ రాజేశ్వరిదేవికి నైవేద్యం పెట్టి అమ్మవారి కృపకు పాత్రులు అవ్వండి.