కొంత మంది కూరలు రుచిగా ఉండటం కోసం రెండు, మూడు రకాల కూరలను కలిపి వండుతూ ఉంటారు. అలా కొన్ని రకాల ఆహార పదార్థాలను కలిపి తీసుకోకూడదని మన మన ఆయుర్వేద వైద్య శాస్త్రం చెబుతుంది. అసలు ఏ ఏ ఆహార పదార్థాలు కలిపి తినకూడదు. వాటిలోని వాస్తవాలను ఇప్పుడు తెలుసుకుందాం..!
మనం ఏమైనా రెండు ఆహారపదార్థాలను కలిపి తింటే అవి రెండు ఒకే ఈ విధంగా ఒకే సమయంలో జీర్ణమయ్యేలా అలా ఉండాలి. లేకపోతే ముందు ఒకటి జీర్ణమవుతుంది. తర్వాత రెండోది ఎసిడిటీ ఫామ్ చేసి జీర్ణ వ్యవస్థను దెబ్బతీస్తుంది.
అలాంటి ఆహార పదార్థాల్లో ముందుగా చెప్పుకోవాల్సింది. కోడిగుడ్డు,పొట్లకాయ ఈ రెండిటి గురించి చాలామంది వినే ఉంటారు. పొట్లకాయ లో నీటిశాతం ఎక్కువ ఉంటుంది. కాబట్టి తిన్న వెంటనే అరిగిపోతుంది. కోడి గుడ్డు లో ప్రోటీన్స్, మాంసకృత్తులు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల లేటుగా జీర్ణమవుతుంది. ఇలా రెండు కలిపి తీసుకోవడం వలన పొట్టలో యాసిడ్స్ తయారయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే మన పెద్దవాళ్ళు ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే విషంతో సమానం అని చెబుతూ ఉంటారు.అలాగే పాలకూర, టమాట కూడా ముఖ్యమైనదే. వీటిని కలిపి తీసుకోవడం వలన కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. దానికి కారణమైన ఆక్సలేట్ అనే పదార్థం ఈ రెండింటిలో ఉంటుంది. అందువలన మూత్రపిండ సంబంధిత సమస్యలు వస్తాయి. అందుకని పాలకూర, టమాటాకు దూరంగా ఉండటమే మంచిది. బెండకాయ మనిషి శరీరానికి మంచి పోషకాలు అందించడంలో ముందువరుసలో ఉంటుంది. అయితే దీనిని తిన్న వెంటనే కాకరకాయ, ముల్లంగి అసలు తినకూడదు. ఇలా తినడం విరుద్ధం. ఈ రెండు కలిపి తీసుకుంటే జీర్ణ సమస్యలతో పాటు తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
ఆయుర్వేద మందులు వాడేటప్పుడు, ఆపరేషన్ చేయించుకున్న వారు, దురద సమస్యలు ఉన్న వారు ఎక్కువగా గోంగూర, వంకాయ తినకూడదు అంటారు. ఇవి రెండు ఎలర్జీ కలిగించే గుణాలు కలిగి ఉంటాయి. అలాగే మన శరీరంలో వేడిని పెంచుతాయి. అలాగే ఉసిరికాయను కూడా రాత్రిపూట తీసుకోకూడదు. ఎందుకంటే ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రాత్రిపూట ఎక్కువగా తీసుకుంటే కఫ, రక్త సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. వీలైనంతవరకూ రెండు, మూడు రకాల ఆహార పదార్థాలను కలిపి వండుకుని తినక పోవడమే మంచిది. ఒకవేళ వండవలసి వస్తే అవి తేలికగా జీర్ణమయ్యేవా కాదా అని ఒకసారి ఆలోచించి వండండి.