Breaking: ఢిల్లీలో భూకంపం సంభవించింది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు పలు ప్రాంతాల్లో గురువారం మధ్యాహ్నం భారీ భూప్రకంపనలు వచ్చాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.3 గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. జమ్ముకశ్మీర్, పంజాబ్, ఛండీగఢ్ లో భూమి కంపించింది. అఫ్ఘనిస్థాన్ లో భూకంప కేంద్రంగా గుర్తించినట్లు తెలిపింది.
ఢిల్లీ – ఎన్సీఆర్ ప్రాంతంలో 30 సెకన్ల పాటు భూమి కంపించింది. ఈ భూకంపం ధాటికి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురైయ్యారు. ఇళ్లు, కార్యాలయాల నుండి బయటకు పరుగులు తీశారు. మరో పక్క ప్రకంపనలతో ఇళ్లలోని ప్యాన్లు, ఇతర వస్తువులు ఊగిపోయాయి. వీటిక సంబంధించిన దృశ్యాలను స్థానికులు తమ సెల్ ఫోన్ లో రికార్డు చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో వైరల్ అయ్యాయి.
BJP: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీకి కీలక నేత రాజీనామా
Earthquake of Magnitude:6.1, Occurred on 11-01-2024, 14:50:24 IST, Lat: 36.48 & Long: 70.45, Depth: 220 Km ,Location: Afghanistan for more information Download the BhooKamp App https://t.co/fN2hpmK3jO @KirenRijiju @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia @Indiametdept pic.twitter.com/q5pkBVscsW
— National Center for Seismology (@NCS_Earthquake) January 11, 2024