YSRCP: టీడీపీ అధినేత చంద్రబాబుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఈసీ) నోటీసులు జారీ చేసింది. వైసీపీ ఇచ్చిన పిర్యాదు మేరకు చంద్రబాబుకు రాష్ట సీఈవో ముఖేష్ కుమార్ మీనా నోటీసులు జారీ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిపై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టడంతో టీడీపీ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తొందని వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు.
సోషల్ మీడియా ఖాతాలు ఎక్స్ (ట్విట్టర్), యూట్యూబ్, ఫేస్ బుక్ ద్వారా టీడీపీ అసభ్యకర ప్రచారం చేస్తొందని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్ వ్యక్తిత్వంపై దాడి చేసే ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన సీఈవో ముఖేష్ కుమార్ మీనా .. చంద్రబాబుకి నోటీసులు జారీ చేశారు. 24 గంటల్లోగా సీఎం వైఎస్ జగన్ పై అసభ్య పోస్టులు తొలగించాలని ఆదేశించారు.
YS Jagan: వైసీపీ ఎన్నికల ప్రచారం .. జనంలోకి జగన్ .. 21 రోజుల పాటు బస్సు యాత్ర