ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు ఉన్న కొద్దీ వేడెక్కుతున్నాయి. అధికారంలోకి వచ్చినా తర్వాత వైయస్ జగన్ తీసుకున్న నిర్ణయాలు ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్నాయి. మరోపక్క ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తున్నాయి. ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలను ఆకట్టుకుంటూనే మరో పక్క రాజకీయ ఎత్తుగడలతో ప్రత్యర్థి పార్టీకి భవిష్యత్తు లేకుండా కీలక నాయకులకి చుక్కలు చూపిస్తున్నారు. చంద్రబాబు హయాంలో ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుని అవినీతి చేసిన మంత్రులను టార్గెట్ చేసి ఒక్కొక్క విషయాన్ని బయట పెట్టే కార్యక్రమానికి వైయస్ జగన్ ముందు నుంచి శ్రీకారం చుట్టిన విషయం అందరికీ తెలిసిందే.
ఈ తరుణంలో తాజాగా చంద్రబాబు హయాంలో కార్మికశాఖ మంత్రిగా పనిచేసిన అచ్చెన్నాయుడు ESI స్కామ్ లో 150 కోట్లకు అవినీతికి తెగబడ్డారు అని విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ విచారణ ప్రారంభించింది. ముందుగా ఈ స్కామ్ విషయంలో తెలంగాణ విజిలెన్స్ అప్పట్లో భారీ కుంభకోణం జరిగినట్లు తేల్చడంతో, తాజాగా ఏపీ విజిలెన్స్ అధికారులు చేసిన దర్యాప్తులో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పాత్ర కూడా ఉంది అని విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ నిర్ధారించింది.
నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారంగా ఎవరికి పడితే వారికి అనుమతులు ఇచ్చి లబ్ధి పొందినట్లు… రూపాయిన్నర టాబ్లెట్… నాలుగు రూపాయలకు అమ్మే విధంగా పేదవారి ప్రాణాలతో అచ్చెన్నాయుడు ESI స్కామ్ ద్వారా వ్యవహరించారని…ఏసీబీ దర్యాప్తు సంస్థ నిర్ధారించింది. ఈ వ్యవహారంలో అచ్చెన్నాయుడు అరెస్ట్ అయిన 12 గంటలకు ఏసీబీ అధికారులు చేసిన వ్యాఖ్యలకు, మరికొంత మంది తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్లు ఉన్నారనే వార్తలు రావడంతో టీడీపీలో ఉన్నవారికి చెమటలు పడుతున్నట్లు టాక్ నడుస్తోంది. అంతేకాకుండా ఈ వ్యవహారంలో మాజీ మంత్రి మరొకరు ఉన్నట్లు కూడా విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ విచారణలో తేలినట్లు సమాచారం.