Breaking: ఢిల్లీ ఎయిమ్స్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఎండోస్కోపీ వార్డులో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ప్రమాదాన్ని గమనించిన వెంటనే రోగులను ఆసుపత్రి సిబ్బంది బయటకు తరలిస్తున్నారు. ఆసుపత్రి యాజమాన్యం సమాచారంతో అగ్ని మాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు.
ఆరు ఫైర్ ఇంజన్ లతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. భారీ అగ్ని ప్రమాదంలో రోగులు, వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు. ఎమర్జన్సీ వార్డు నుండి రోగుల బంధువులు బయటకు పరుగులు తీశారు. అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
Political Survey: ఏపీలో అధికారం ఏ పార్టీకి..? ఎవరికి ఎన్ని సీట్లు ..??