విశాఖపట్నం, జనవరి 9: విశాఖ రైల్వే స్టేషన్లో బుధవారం సుమారు రెండు కోట్ల రూపాయల విలువ చేసే మూడు కిలోల బంగారాన్ని డిఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మయన్మార్ నుండి భారత్కు బంగారం స్మగ్లింగ్ చేసినట్లు అనుమానం. గువహటీ – సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్లో బంగారం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు కాటన్ బనియన్లలో ఈ బంగారం దాచి తరలిస్తున్నారు.
previous post