BRS: తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన తర్వాత కేసిఆర్ నేతృత్వంలో వరుసగా రెండు ఎన్నికల్లో విజయం సాధించిన టీఆర్ఎస్ .. పార్టీని జాతీయ పార్టీ బీఆర్ఎస్ గా మార్పు చేసిన తర్వాత ఓటమి పాలైంది. పార్టీ ఓటమి పాలైన తర్వాత గులాబీదళపతి కేసీఆర్ బయటకి రాలేని పరిస్థితి నెలకొంది. బాత్ రూమ్ లో కేసీఆర్ జారి పడటంతో కాలు తుంటి ఎముక విరిగి ఆసుపత్రి పాలైయ్యారు.
కేసిఆర్ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేయించుకున్న తర్వాత ఇంటికి చేరుకుని రెస్ట్ తీసుకుంటున్నారు. వాకర్ సహాయంతో ఇంట్లోనే అటు ఇటూ తిరుగుతూ కాలక్షేపం చేస్తున్నారు. దీంతో పార్టీ వ్యవహారాలు అన్నీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు (కేటిఆర్) చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
త్వరలో లోక్ సభ ఎన్నికలు జరగనుండటంతో బీఆర్ఎస్ ఆ ఎన్నికలపై దృష్టి సారించింది. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహిస్తున్నారు కేటిఆర్. ఈ సమీక్షల సందర్భంగా కేటిఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన చేస్తున్న పలు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మరో ఏడు ఎనిమిది స్థానాలు గెలిచి ఉంటే రాష్ట్రంలో హంగ్ వచ్చేదని అంటున్నారు. తక్కువ ఓట్ల తేడాతో 14 స్థానాల్లో ఓటమి పాలయ్యామని చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ దొంగ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని విమర్శిస్తున్నారు. ఇదే క్రమంలో కారు కేవలం సర్వీసింగ్ కు వెళ్లింది.. మళ్లీ రెట్టింపు వేగంతో దూసుకొస్తుందని కామెంట్స్ చేస్తున్నారు కేటిఆర్.
బీఆర్ఎస్ ఎన్నికల గుర్తు కారు కావడంతో కారు సర్వీసింగ్ కు వెళ్లింది అని అంటున్నారు. కేటిఆర్ వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, షెడ్డుకు వెళ్లిన కారు సర్వీసింగ్ కు ఎన్నాళ్లు పడుతుంది ..? ఎంత ఖర్చు అవుతుందని..? నెటిజన్ లు ప్రశ్నిస్తున్నారు.
ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ కారుకు టైర్లు పంక్చర్ అయ్యింది. గాలి పోయింది అంటూ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ యే స్వయంగా కారు సర్వీసింగ్ కు వెళ్లిందని చెబుతుండటంతో..పదేళ్లుగా నడిచిన కారు బోర్ కు వచ్చిందని, అది రిపేర్ చేయడం కుదరని ఇంజన్ యే మార్చాల్సి ఉంటుందని అంటున్నారు ప్రత్యర్ధులు.
Ayodhya Ram Mandir: అయోధ్యలో ఆవిష్కృతమైన అద్భుత ఘట్టం