కర్ణాటకలోని హుబ్బల్లి రైల్వే స్టేషన్ ను ఇప్పుడు శ్రీ సిద్ధరూధ స్వామీజీ రైల్వేస్టేషన్ అని పేరు మార్చిన విషయం అందరికీ తెలిసిందే.. ఇప్పుడు ఈ రైల్వేస్టేషన్ ప్రపంచంలోనే అతిపెద్ద పొడవైన రైల్వేస్టేషన్ గా మార్చి వరల్డ్ రికార్డ్ సృష్టించనున్న రైల్వే శాఖ.
ఏర్పాట్లు ఇలా :
1400 మీటర్ల పొడవు 10 మీటర్ల వెడల్పుతో కలిగిన ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే ప్లాట్ ఫామ్ గా కర్ణాటకలోని హుబ్లీ స్టేషన్ ను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఫ్లాట్ ఫామ్ 550 మీటర్ల పొడవు ఉండగా దీనిని ఈ సంవత్సరంలో 1400 మీటర్లకు విస్తరించనున్నట్లు అధికారులు తెలిపారు. వార్డుల పునర్నిర్మాణం, భవన నిర్మాణ పనులు, సీలింగ్, మూడవ ప్రవేశ నిర్మాణం, ఎలక్ట్రికల్ ఇతర సంబంధిత పనుల కోసం 90 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది.రైల్వే స్టేషన్ లో ప్రస్తుతం 2 ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లు ఉన్నాయి. ఒకటి ప్రధాన ద్వారం వద్ద, మరొకటి గడగ్ రోడ్లో, మూడవ ఎంట్రీ కూడా ఇప్పుడు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పొడవైన ఫ్లాట్ఫామ్ జాబితాలో భారతీయ రైల్వే ఫ్లాట్ ఫామ్ లు ఆధిపత్యం వహిస్తున్నాయి.ఉత్తరప్రదేశ్లోని గోరక్ పూర్ రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్ 1366 మీటర్లు, కేరళలోని కొల్లం జంక్షన్ 1180 మీటర్లు. ఈ నిర్మాణం పూర్తయితే ఇదే మొదటి స్థానం ఏర్పరచుకుంటుంది.
వరల్డ్ రికార్డ్ సృష్టించడానికి సిద్ధంగా ఉన్న శ్రీ సిద్ధరూధ స్వామీజీ రైల్వేస్టేషన్ :
ఫ్లాట్ ఫామ్ పొడవును 1400 మీటర్లకు పెంచాలని రైల్వే నిర్ణయించిన తరువాత ఈ ప్రాజెక్టును 1505 మీటర్లకు మార్చాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు కోసం రైల్వే శాఖ 90 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. జనవరి 2020 నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు. 2030నాటికి భారత రైల్వేలు విద్యుదీకరణ చేయడానికి రైల్వే శాఖ కృషి చేస్తోంది.ఈ ప్రాజెక్టును 2020 జూన్ నాటికి పూర్తి చేయాల్సి ఉంది. కరోనా కారణంగా పూర్తికావడానికి ఇప్పటికే ఆలస్యం అయింది. ఈ ఫ్లాట్ ఫామ్ నిర్మాణంలో 250 మందికి పైగా కార్మికులు పని చేస్తున్నారు.ప్లాట్ ఫామ్ నిర్మాణం త్వరలోనే పూర్తవుతుందని. కొత్త ఫ్లాట్ ఫామ్ లతో రైళ్లను రెండు దిశలకు ఒకేసారి పంపవచ్చు. అమెరికా, రష్యా, చైనా తరువాత ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద ట్రైన్ నెట్వర్క్ గా భారతదేశం ఉంది. దేశంలో 67368 కిలోమీటర్ల రైల్వే, 7300 స్టేషన్ రైల్వే స్టేషన్లను ఉన్నాయి. రైల్వే ట్రాక్ చుట్టూ ఉన్న భూమిలో సౌరశక్తితో పనిచేసే పరికరాలను ఉపయోగించి భారతదేశంలో 20 గిగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది..రైల్వే మంత్రి మాట్లాడుతూ విద్యుత్ శక్తి తో నడుస్తాయని చెప్పారు. భారత రైల్వే కార్బన్ రైల్వే అవుతుందని ఆయన వివరించారు. ప్రతి సంవత్సరం 800 కోట్ల మంది ప్రయాణికులను, 2.2 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేస్తుంది. మొత్తం ట్రైన్ నెట్వర్క్ యొక్క 100% విద్యుదీకరణ కలిగి ఉన్న మొదటి దేశం మన భారత్.
ఈ రైల్వే స్టేషన్ కు రెండుసార్లు నామకరణం జరిగింది :
సౌత్ వెస్ట్రన్ రైల్వే ప్రధాన కారణంగా కార్యాలయంగా ఉన్న సౌత్ వెస్ట్రన్ రైల్వే ప్రధాన కారణంగా కార్యాలయంగా ఉన్న హుబ్లీ రైల్వే స్టేషన్ ను గత ఐదేళ్లలో రెండు సార్లు దీని పేరు మార్చబడింది. దీనిని 2015లో హుబ్లీ నుండి హూబల్లి గా మార్చారు. ఈ ఏడాది సెప్టెంబర్ లో కేంద్ర ప్రభుత్వం మరలా శ్రీ సిద్ధరూధ స్వామీజీ రైల్వేస్టేషన్ గా మార్చారు. ఈ స్వామీజీ భారతీయ హిందూ గురువు, తత్వవేత్త. హూబల్లి రైల్వే స్టేషన్ పేరు మార్చాలన్న హూబల్లియన్ల దీర్ఘకాల డిమాండ్ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది.