మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా ఆచార్య. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా రక రకాల కారణాల వల్ల పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. కాగా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అన్న ఆతృతతో ఉన్నారు ప్రేక్షకులంతా. ఇప్పటికే 40 శాతం చిత్రీకరణ పూర్తయింది. ఈ 40 శాతంలో కొంత టాకీ పార్ట్ తో పాటు చిరంజీవి, రెజీనాలపై ఒక సాంగ్ షూట్ చేశారు.
అయితే తాజా సమాచారం ప్రకారం నవంబర్ నుంచి మళ్ళీ ఆచార్య ని సెట్స్ మీదకి తీసుకు వెళ్ళాలని కొరటాల శివ భావిస్తున్నాడట. ఇక ఈ సినిమా మొదలయినప్పటి నుంచి ఒక విషయంలో అసలు క్లారిటీ రావడం లేదు. ఈ సినిమాలో రామ్ చరణ్ స్పెషల్ క్యారెక్టర్ ఎంతవరకు ఉంటుందనే విషయంలో చిత్ర యూనిట్ నుంచి సరైన కన్ఫర్మేషన్ రావడం లేదన్న టాక్ నడుస్తోంది. పొరపాటున మెగాస్టార్ ఆచార్య టైటిల్ ని ముందే ఎనౌన్స్ చేయడంతో అప్పటి నుంచి ఈ సినిమాకి సంబంధించిన మిగతా విషయాలు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
కాగా ఆచార్య లో రామ్ చరణ్ కి జంటగా పలువురు హీరోయిన్స్ పేర్లు వినిపించాయి. కాని ఫైనల్ గా కీయరా అద్వానీ ఫిక్స్ అయ్యిందని టాక్ వచ్చింది. కాని దర్శకుడు కొరటాల శివ మాత్రం రష్మీక మందన్నను తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. అయితే భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ అందుకుంది గాని చరణ్ తో వినయ విధేయ రామ చేసి డిజాస్టర్ చూసిన కారణంగా చరణ్ కీయరాకు ఆచార్యలో అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నాడట. మరి చరణ్, కొరటాల ఏ హీరోయిన్ ని ఫైనల్ చేస్తారో చూడాలి. ఒకవేళ రష్మిక గనక ఈ సినిమా చేస్తే ఇక తిరుగుండదన్న మాట వినిపిస్తుంది.