India vs England : ఇండియా-ఇంగ్లాండ్ మధ్య అతి కీలకమైన ఐదవ టి20 మ్యాచ్ మరికొద్దిసేపట్లో మొదలుకాబోతోంది. ఇరు జట్లు సిరీస్ ఆద్యంతం హోరాహోరీగా తలపడ్డాయి. అందుకే చివరి రెండు మ్యాచ్ లు గెలిచిన ఇరు జట్లు 5వ మ్యాచ్ లో ఎలాగైనా సత్తా చాటి సిరీస్ సొంతం చేసుకోవాలని ఆత్రుతగా ఉన్నాయి.
మనం చూసిట్లయితే మొదటి మూడు టి20 మ్యాచ్ లో ఛేజింగ్ జట్టు గెలిచింది. నాలుగవ మ్యాచ్లో కూడా రెండవసారి బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ దాదాపు గెలిచేది. అయితే చివర్లో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ చేసిన తప్పిదాల వల్ల, భారత బౌలర్ల పరిస్థితి తగ్గట్టు బంతులు వేయడంతో ఇండియా గెలిచింది కానీ చివరిదైన టి20 మ్యాచ్ లో నుండి ఇరు జట్ల నుండి ఎటువంటి తప్పిదాలు జరగకపోవచ్చు. అందుకని టాస్ కీలకం కానుంది.
టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎలాగో ఎంచుకుంటుంది కాబట్టి టాస్ గెలిస్తే సగం మ్యాచ్ గెలిచి చేసినట్లే అని విశ్లేషకులు చెబుతున్నారు. పైగా ఈ రోజు అహ్మదాబాద్లో మంచు బాగా ఎక్కువగా ఉంటుందట. బౌలర్లకు స్లో డెలివరీలు వేసేందుకు అలాగే స్పిన్నర్లకు బాల్ గ్రిప్ చేసి టర్న్ చేసేందుకు చాలా కష్టంగా ఉంటుంది.
రెండోఇన్నింగ్స్ మొదలయ్యేసరికి రాత్రి 9:00 దాటుతుంది.ఆ సమయంలో మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుంది అవుట్ ఫీల్డ్ కూడా చిత్తడిగా ఫీల్డర్లకు సౌకర్యంగా ఉండదు. ఇదంతా మొదట బౌలింగ్ చేసిన జట్టుకు ఊరటనిచ్చే అంశాలు కాబట్టి. టాస్ గెలవడంలో పేలవ రికార్డు ఉన్న విరాట్ కోహ్లీ ఈరోజు మాత్రం టాస్ గెలిస్తే ఇండియా సగం సిరీస్ కొట్టేసినట్టే అని చెప్పవచ్చు.