శత్రువు ముందు నమ్రతతో, మర్యాదగా ఉంటే నిన్ను పిరికివాడనుకునే ప్రమాదం ఉంది. పాండవులతో కౌరవులు వ్యవహరించిన విధంగా అన్నమాట. భారత సైన్యం బుధవారం ట్వీట్ చేసిన ఒక పద్యం భావం ఇది. వాస్తవాధిన రేఖ ఆవల జైషె మొహమ్మద్ శిక్షణా శిబిరంపై ఈ తెల్లవారుజామున భారత వైమానిక బలగాలు బాంబు దాడులు చేసిన తర్వాత ఆర్మీ ఈ విధంగా స్పందించింది.
రామ్ధారీ సింగ్ దిన్కర్ రాసిన హిందీ పద్యం అది. భారత ఆర్మీ ప్రజా సమాచార విభాగం అదనపు డైరక్టర్ జనరల్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ పద్యం పోస్టు చేశారు. ఎవరైనా గానీ శక్తివంతంగా, విజయం సాధించే పరిస్థితిలో ఉన్నపుడే వారు చెప్పే శాంతి వచనాలు వింటారని ఆ పద్యం చెబుతుంది.
'क्षमाशील हो रिपु-समक्ष
तुम हुए विनीत जितना ही,
दुष्ट कौरवों ने तुमको
कायर समझा उतना ही।सच पूछो, तो शर में ही
बसती है दीप्ति विनय की,
सन्धि-वचन संपूज्य उसी का जिसमें शक्ति विजय की।'#IndianArmy#AlwaysReady pic.twitter.com/bUV1DmeNkL— ADG PI – INDIAN ARMY (@adgpi) February 26, 2019