IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సంవత్సరానికిగానూ దుబాయ్ లో రెండో భాగం జరగనుంది. అయితే ఈ సంవత్సరం లీగ్ పూర్తి అయిపోయే లోపల బీసీసీఐ ఐపీఎల్ లో వచ్చే సంవత్సరం నుండి పాల్గొనబోయే మరో రెండు జట్లను ప్రకటిస్తుంది. ఈ రెండు కొత్త జట్ల కారణంగా వచ్చే సంవత్సరానికి మెగా ఆక్షన్ జరగనుంది.
ఈ మెగా వేలంపాటలో అన్ని జట్లు పాల్గొంటాయి. అయితే బిసిసిఐ ఈ వేలంపాటలో పాల్గొనే కొత్త జట్లను దృష్టిలో ఉంచుకొని కొత్త నిబంధనలు తెచ్చింది. ప్రతీ ఫ్రాంచెజీ తమ జట్టులోని నలుగురు ప్రధాన ఆటగాళ్లు మాత్రమే అట్టి పెట్టుకోవాలి అని రూల్ పెట్టింది. వారిలో కనీసం ఇద్దరు భారత ఆటగాళ్లు ఉండాలని కూడా నిబంధన విధించింది. కాబట్టి ఇద్దరు భారత ఆటగాళ్లు, ఇద్దరు విదేశీ ఆటగాళ్లు లేదా ముగ్గురు భారత ఆటగాళ్లు, ఒక విదేశీ ఆటగాడు పాత జట్ల తోనే కొనసాగే అవకాశం ఉంది.
ఉదాహరణకు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు కోహ్లీ, మాక్స్వెల్, డివిలియర్స్, సిరాజ్ రూపంలో నలుగురు పాత ఆటగాళ్లను వేలానికి వదలకుండా… వారికి అత్యధిక ధర చెల్లించి తమ జట్టులోని ఉంచుకోవచ్చు. ఇలా ప్రతి జట్టు… ఒక నలుగురు ఆటగాళ్లని తమతోనే ఉంచుకోవచ్చు. మిగిలిన వారిని మాత్రం వేలంపాటలో డబ్బులు వెచ్చించి కొనుక్కోవాల్సి ఉంటుంది.
ఇక లీగ్ జరిగే పద్ధతి కూడా వచ్చే సంవత్సరం నుండి మారనుంది. 10 జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి మ్యాచ్లు ఆడే అవకాశం ఉందని అంటున్నారు. లేదా గతంలో లాగానే 10 జట్లు ప్రతి మిగిలిన ప్రతి జట్టు తో రెండు మ్యాచ్లు ఆడి 4 క్వాలిఫయర్స్ వెళ్లే అవకాశం కూడా ఉంది. దీనిపై బిసిసిఐ నిర్ణయం తీసుకుంటుంది.
కొత్తగా రాబోయే జట్లు ఏ నగరాలకు చెందినవి…? వేలంపాట ఎలా జరుగుతుందని క్రికెట్ అభిమానులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.