తెలుగమ్మాయి ఈషా రెబ్బా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పాపులర్ అవడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది. సాధారణంగా తెలుగమ్మాయిలు ఇండస్ట్రీలో అంతగా సక్సస్ అయింది లేదు. కాని ఇప్పుడు లైఫ్ స్టైల్ ట్రెండ్ మారుతుంది. అందుకే తెలుగమ్మాయిలు కూడా ఇండస్ట్రీలో సత్తా చాటేందుకు సిద్దమవుతున్నారు. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాలో చిన్న పాత్ర పోషించింది ఈషా. అయితే అది ఎవరికీ అంతగా గుర్తుండదు. కాని ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ తీసిన ‘అంతకు ముందు ఆ తర్వాత’ సినిమాతో హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఈ సినిమా గురించి చాలా రోజులు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ‘బందిపోటు’ ‘అమీ తుమీ’ ‘మాయా మాల్’ ‘దర్శకుడు’ ‘సుబ్రహ్మణ్యపురం’ ‘బ్రాండ్ బాబు’ వంటి సినిమాల్లో నటించింది. వీటిలో అమీ తుమీ ఈషాకి ఇంకాస్త పాపులారిటీని తెచ్చిపెట్టింది. ఈ సినిమాకి దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ కావడం విశేషం. ఇక నాని నిర్మాణంలో తెరకెక్కిన ప్రయోగాత్మకమైన సినిమా ‘అ!’.. ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమాలతోను బాగానే పేరు తెచ్చుకుంది. వీటితో పాటు ఇటీవల ‘రాగల 24 గంటల్లో’ అనే క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో నటించినప్పటికి ఆ సినిమా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిందో తెలియలేదు.
అయితే ఇలా సినిమాలు చేస్తుంది. ఆ సినిమా రిలీజైనపుడు కొన్నాళ్ళు ఈషా గురించి మాట్లాడుకుంటున్నారు..తర్వాత మర్చిపోతున్నారు. దాంతో ఎక్కడ ఉందో అక్కడే ఉండిపోయింది. అందుకే తెలుగమ్మాయి తెగింపు ఇదే అంటూ గ్లామర్ గా కనిపించడం మొదలు పెట్టింది. హాట్ హాట్ ఫోటోలతో యూత్ ని బాగా టార్గెట్ చేసింది. ఫాలోయింగ్ ని బాగా పెంచుకుంది. అంతేకాదు ఇండస్ట్రీ వాళ్ళు తనవైపు దృష్ఠి మళ్ళేలా నిత్యం సోషల్ మీడియాలో రక రకాల హాట్ ఫోటోలని పోస్ట్ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ‘లస్ట్ స్టోరీస్’ తెలుగు రీమేక్ లో నటిస్తోంది. అలాగే తమిళ్, కన్నడ భాషల్లో నటించే అవకాశము అందుకుంది.