Nithin : యూత్ స్టార్ నితిన్ నటిస్తున్న తాజా చిత్రం మాస్ట్రో. హిందీలో సూపర్ హిట్ గా నిలిచిన ‘అంధాధూన్’ చిత్రానికి అఫీషియల్ రీమేక్ గా రూపొందుతోంది. ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ నితిన్ సరసన నటిస్తోంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా కీలక పాత్రలో కనిపించబోతోంది. రాజ్ కుమార్ ఆకెళ్ళ సమర్పణలో.. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ లో సుధాకర్ రెడ్డి, సోదరి నికితా రెడ్డి నిర్మిస్తున్నారు. దాదాపు ఈ సినిమా చిత్రీకరణ పూర్తైనట్టు సమాచారం. కరోనా సెకండ్ వేవ్ కారణంగా కొంత పార్ట్ బ్యాలెన్స్ ఉంది.
కాగా త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన మిగతా పార్ట్ టాకీ పార్ట్ అండ్ సాంగ్స్ ..పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ ని పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారట. అయితే పోయిన సంవత్సరం రిలీజ్ అవ్వాల్సిన నితిన్ చిత్రాలు కరోనా కారణంగా థియేటర్లు మూతపడటంతో ఈ సంవత్సరం ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ఫిబ్రవరిలో చెక్ సినిమా వచ్చి ఫ్లాప్ గా మిగిలింది. మార్చ్ లో ‘రంగ్ దే’ వచ్చింది. హిట్ టాక్ తెచ్చుకుంది. కానీ ఆశించిన స్థాయిలో వసూళ్ళు మాత్రం దక్కలేదు. త్వరలో రంగ్ దే ఓటీటీలో రిలీజ్ కాబోతోంది.
Nithin : నితిన్ ఈ ఆఫర్ ఒప్పుకుంటాడా…?
ఈ క్రమంలోనే ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ‘మాస్ట్రో’ కూడా ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మణిశర్మ తనయుడు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ మహతీ స్వర సాగర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఓ వారం మాత్రమే షూటింగ్ బాలెన్స్ ఉందట. జూన్ రెండో వారంలో ఈ బ్యాలెన్స్ షూటింగ్ పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. మరి నితిన్ ఈ ఆఫర్ ఒప్పుకుంటాడా లేదా అనే విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇటీవల ఓటీటీలో రిలీజవుతున్న సినిమాలకి మంచి ఆదరణ లభిస్తోంది.