Pawan kalyan : డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన. గత ఏడాది నుంచి ఈ ప్రాజెక్ట్ను పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు పూరి. గత ఏడాది ఓ క్రేజీ అప్డేట్ కూడా ఇచ్చాడు. కానీ ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుంది..హీరో ఎవరు..ఈ సినిమా కథ ఏంటనేది మాత్రం వెల్లడించడం లేదు. అయితే విజయ్ దేవరకొండతో లైగర్ తెరకెక్కిస్తున్న పూరి త్వరలో తన డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన సెట్స్ మీదకి తీసుకు రాబోతున్నట్టు తెలుస్తోంది.
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ పాన్ ఇండియన్ సినిమా లైగర్ తెరకెక్కిస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్గా నటిస్తోంది. 120 కోట్ల బడ్జెట్తో నాలుగు భాషల్లో రూపొందిస్తున్నారు. మెజారిటీ భాగం షూటింగ్ పూర్తయింది. దాంతో పూరి తన డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన మీద దృష్టి పెట్టినట్టు తాజా సమాచారం. అంతేకాదు ఈ ప్రాజెక్ట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించబోతున్నట్టు తెలుస్తోంది. వాస్తవంగా ఈ కథ సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయాలనుకున్నాడు పూరి. కానీ ఆయనకి కథ నచ్చకపోవడంతో పెండింగ్లో పడింది.
Pawan kalyan : పవన్ కళ్యాణ్ – పూరి సినిమా ఉండే అవకాశాలున్నాయి.
ఆ తర్వాత యష్, రజనీకాంత్ లతో ఈ ప్రాజెక్ట్ చేస్తాడని అన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పేరు వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ తో బద్రి సినిమా తీసి ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమైన పూరి ఆ తర్వాత కెమెరా మ్యాన్ గంగతో రాంబాబు తీశాడు. ఇప్పుడు హ్యాట్రిక్ సినిమాగా డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన చేయబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు..సాగర్ కె చంద్ర దర్శకత్వంలో ఏకే రీమేక్ లో నటిస్తున్నాడు. వీటి తర్వాత హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి సినిమాలున్నాయి. ఆ తర్వాత పూరి సినిమా ఉండే అవకాశాలున్నాయి.