బాహుబలి ఫ్రాంఛైజీ తో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకున్నాడు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి బిగినిగ్.. బాహుబలి కన్క్లూజన్ రెండూ కలిపి బాక్సాఫీస్ వద్ద రూ.2000 కోట్ల కి పైగానే వసూళ్ళు రాబట్టి సంచలనం సృష్ఠించాయి. ఒక తెలుగు సినిమా ఈ రేంజ్ లో వసూళ్ళు సాధించడం చూసి దేశం మొత్తం ఆశ్చర్యపోయింది.
‘దంగల్’ లాంటి బయోపిక్ తో తో పోటీపడి కూడా ఇండియా వసూళ్లలో నంబర్ వన్ స్థానంలో ఉండి మొత్తం సౌత్ అండ్ నార్త్ సినిమా ఇండస్ట్రీలలో హాట్ టాపిక్ అయింది. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన దంగల్ దేశీయ వసూళ్ల పరంగా బాహుబలి2 కంటే వెనకబడడం పెద్ద సంచలనమైంది. అంతేకాదు బాహుబలి ఫ్రాంఛైజీ తో ప్రభాస్ స్టామినా ఏంటో ప్రూవ్ అయింది.
ఆ ఉత్సాహంతో ప్రభాస్ సాహో లాంటి మరో భారీ పాన్ ఇండియా సినిమాలో నటించాడు. బాహుబలి ఫ్రాంఛైజీ ని మించి భారీ బడ్జెట్ తో సాహసం చేశారు. హాలీవుడ్ సాంకేతిక నిపుణులతో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందించారు. అయితే సాహో హిందీ లో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. కాని టాలీవుడ్ సహా ఇతర సౌత్ భాషల్లో మాత్రం అనుకున్నంతగా సక్సస్ ని సాధించలేకపోయింది. ఇది ప్రభాస్ కి నిరాశనే మిగిల్చింది. బాహుబలి ప్రభావంతో సాహోకి అద్భుతమైన ప్రీరిలీజ్ బిజినెస్ అయింది. కానీ ఇప్పుడు సాహో ప్రభావం రాధే శ్యామ్ మీద తీవ్రంగా పడిందని అంటున్నారు.
ప్రభాస్ నటిస్తున్న 20వ సినిమా ‘రాధే శ్యామ్’ కి అనుకున్నంతగా బిజినెస్ జరుగుతుందా అన్న అనుమానాలు ఇప్పటి నుంచే మొదలయ్యాయని అంటున్నారు. రాధేశ్యామ్ కి ప్రీబిజినెస్ పరంగా అంత హైప్ లేకపోవడమే అందుకు కారణం అని తెలుస్తుంది. ముఖ్యంగా లాక్ డౌన్ పీరియడ్ లో రాధే శ్యామ్ కి హైప్ తీసుకు రావడంలో టీమ్ సక్సస్ కాలేదన్న టాక్ నడుస్తోంది. అలాగే సాహో సినిమాతో ఏమాత్రం పోలిక లేని కథతో రాధే శ్యామ్ తెరకెక్కుతున్న కారణం కూడా ఒకటి. మరి ‘రాధే శ్యామ్’ ప్రభాస్ కి ఎలాంటి రిజల్ట్ ని ఇస్తుందో చూడాలి.