Virat Kohli: మనదేశంలో సినిమా హీరోల ను, స్టార్ క్రికెటర్లను ఆరాధ్యదైవాలు గా పూజించే సంప్రదాయం ఇప్పటిది కాదు. తరానికి ఒక హీరో, ఒక క్రికెటర్ మారుతూ ఉంటారు. సచిన్ టెండూల్కర్ తర్వాత ధోనీ ఆ తర్వాత విరాట్ కోహ్లీ కి భారత్ క్రికెట్ అభిమానులు ఫిదా అయిపోయారు. అయితే విరాట్ కోహ్లీకి అభిమానులు ఎంత మంది ఉన్నారో అలాగే అతని కెప్టెన్సీ అంటే పడని వారు కూడా అదే సంఖ్య లో ఉన్నారు.
వీరిలో ఎక్కువ శాతం మంది రోహిత్ శర్మ, ధోని అభిమానుల్లోని కొంతమంది ఉంటారు. విరాట్ కోహ్లీ ఇప్పటి వరకూ ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేదు. అంతెందుకు ఇన్నేళ్ళు ఐపీఎల్ లో rcb జట్టు కెప్టెన్గా ఉన్నప్పటికీ ఒక కప్ కూడా గెలుపొందలేదు. అటు పక్క చూస్తే రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా ఐదు ఐపీఎల్ ట్రోఫీ లు గెలుపొందాడు. ధోని కంటే మంచి కెప్టెన్సీ రికార్డు రోహిత్ శర్మ టీ20ల్లో రోహిత్ సొంతం.
ఇక ధోనీ అయితే భారత క్రికెట్ కు టి20 ప్రపంచ కప్, వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ సాధించిపెట్టాడు. కోహ్లీ కెప్టెన్సీ లో భారత్ 3 ఐసీసీ ఈవెంట్లలో పాల్గొనగా మూడింటిలో చివరి దశలో పరాజయం పొంది. 2 ఫైనల్స్ ఒక సెమీఫైనల్స్ లో టీమిండియా జట్టు పరాజయం పాలైంది. అయితే ధోనీ కూడా 2013 ఛాంపియన్స్ ట్రోఫీ జరిగిన తర్వాత టీమ్ ఇండియా జట్టు కి రెండు ఐసీసీ ఈవెంట్లలో సారధ్యం వహించినప్పటికీ రెండింటిలో భారత్ విజయం సాధించలేకపోయింది.
అయితే ఇక్కడా కోహ్లీ కెప్టెన్సీ తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఒక్క ట్రోఫీ సాధించలేదు అన్న మైనస్ పాయింట్ పక్కనపెడితే టెస్టుల్లో అతనికున్న ఘనమైన రికార్డు మరే ఇతర భారత్ కెప్టెన్ కూ లేదు. ఇప్పటివరకు భారత్ సొంత గడ్డపై టెస్ట్ సిరీస్ ఓడిపోలేదు. విదేశాల్లో ధోని సారథ్యంలోని టెస్టు జట్టు పర్ఫామెన్స్ అతి దారుణంగా ఉండేది. కోహ్లీ టెస్ట్ జట్టు మాత్రం విదేశాల్లో కూడా అద్భుతమైన ఫర్ఫార్మెన్స్ సాధించి సిరీస్ లే గెలుచుకుంది.
మరోవైపు పరిమిత ఓవర్ల క్రికెట్లో కూడా భారత్ ని మేటి జట్టుగా నిలబెట్టడంలో విరాట్ పాత్ర ఎంతైనా ఉంది. రాబోయే సంవత్సరాల్లో ఉండటంతో కోహ్లీ కనీసం మూడు ట్రోఫీలైనా సాధించి అందరికీ సరైన సమాధానం చెబుతాడు అని అతని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే నిజమైన భారత క్రికెట్ అభిమాని ఇలా ఒకరి కోసం మరొకరు తగ్గించడం మానేసి భారత జట్టు హితమే కోరుకుంటాడు.