Jaathi Ratnalu : ‘జాతిరత్నాలు‘ సినిమా ఇప్పుడు టాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. సినిమా అతి తక్కువ బడ్జెట్ మీద నిర్మించబడి విడుదలై వారం రోజులు దాటినా రోజుకు నికరంగా కోటిన్నర పైగా వసూలు చేస్తోంది. పెట్టిన బడ్జెట్ తో పోలిస్తే అత్యధికంగా ప్రాఫిట్ వచ్చిన సినిమాల లిస్టు లో టాప్ టెన్ లో చోటు సంపాదించింది. అటువంటి సినిమా తీసిన దర్శకుడు అనుదీప్ కె.వి కూడా సోషల్ మీడియా ద్వారా బాగా ఫేమస్ అయ్యాడు.
అనుదీప్ మొదటి సినిమా ‘పిట్టగోడ‘ ఫ్లాప్. ఒక కుర్ర హీరో మొదటి సినిమా ఫ్లాప్ తీసి… ఆ తర్వాత సినిమా అవకాశం దక్కించుకోవడం ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక అలాంటిది అతను స్వప్న లాంటి పేరున్న సంస్థ తో నాగ్ అశ్విన్ నిర్మాతగా ‘జాతిరత్నాలు‘ తీశాడు. విడుదలకు ముందే భారీ హైప్ సంపాదించి రిలీజ్ తర్వాత బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తున్న ఈ చిత్రం విదేశాలలో కూడా ఇరగ్గొడుతోంది. అయితే ప్రేక్షకులను అటు సినిమా ద్వారా ఇటు ఇంటర్వ్యూల ద్వారా విపరీతంగా నవ్వించిన జీవితంలో కన్నీళ్లు కూడా అదే రేంజ్ లో ఉన్నాయి.
చాలా మందిలాగా చదువు మధ్యలో వదిలేసి సినిమానే జీవితంగా అడుగులేసిన కోవలోకే అనుదీప్ వస్తాడు. సొంత ఊరు వదిలి హైదరాబాద్ వచ్చాక ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఒక పూట గడవడం కోసం ఒక తెలివైన పని చేసే వాడినని చెప్పాడు అనుదీప్. తన లగేజ్ ఒక ఫ్రెండ్ గదిలో పెట్టి… తను వేరే గదిలో ఉండేవాడు అని చెప్పాడు. ఒకరు రెంట్ అడిగితే కేవలం లగేజ్ మాత్రమే ఉంది కదా అని… ఇంకొకరు అడిగితే నేను ఉన్నాను కానీ లగేజ్ లేదు కదా అని ఇద్దరికీ రెంట్ కట్టకుండా తప్పించుకునే వాడు అని తెలిపాడు.
తన సినిమాల్లో అవకాశాల కోసం కష్టపడుతున్న సమయంలో తనకు శ్రీకాంత్ అనే ఒక స్నేహితుడు ఉన్నాడని చెప్పాడు. అతను ఎంతగానో సహాయం చేసి… తను ఉద్యోగం చేస్తూ… అనుదీప్ ఇండస్ట్రీలలో సర్దుకునే వరకు ప్రతి నెలా డబ్బులు పంపించాడు అని చెప్పాడు. అతని మీద అభిమానంతోనే ‘జాతిరత్నాలు‘ హీరోకు జోగిపేట శ్రీకాంత్ అని పేరు పెట్టినట్లు కూడా వెల్లడించాడు. అయితే చిన్నప్పటి నుండి ఎన్ని కష్టాలు ఉన్నా ఎప్పుడూ నవ్వుతూ… నవ్విస్తూ ఉండే వాడిని అని చెప్పి,అ అనుదీప్… తన కన్న తల్లి ఎక్కడికైనా చావులకి వెళ్తే తనను తీసుకువెళ్ళేది కాదని తెలిపాడు. అక్కడ కూడా నవ్వేసి గొడవలు సృష్టిస్తానేమో అని తన తల్లి అతనిని చావులకి తీసుకెళ్ళేది కాదని అనుదీప్ చెప్పడం విశేషం.