నగరి శాసనసభ్యురాలు ఏపీఐఐసీ చైర్మన్ రోజాకు ముఖ్యమంత్రి జగన్ మోహన రెడ్డి మరో ముఖ్యమైన పదవి ఇవ్వనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
కరోనా నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో తిరిగి సినిమా షూటి౦ గులకు అనుమతిచ్చేందుకు సంబంధించి జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఒక కమిటీకి రోజాను అధ్యక్షురాలుగా నియమించబోతున్నట్లు ఉన్నతస్థాయి వర్గాల ద్వారా తెలియవచ్చింది.నిజానికి జగన్ ప్రభుత్వంలో రోజా మంత్రి కావల్సింది .కుల సమీకరణాల లెక్కలు కుదరక ఆమెకు జగన్ మంత్రి పదవివ్వలేకపోయినా అంతకు సమానమైన ఏపీఐఐసీ చైర్మన్ పదవిచ్చారు. సీఎం జగన్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తున్నారు. ఆమె పనితీరు పట్ల ముఖ్యమంత్రి జగన్ చాలా సంతృప్తిగా ఉన్నారంటారు .ఈ దశలో కరోనా నేపథ్యంలో ఏపీలో షూటింగ్స్ కోసం ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసే నిర్ణయం తీసుకోవడంతో పాటు రోజాను ఈ కమిటీ చైర్మన్గా చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. టాలీవుడ్లో మంచి సంబంధ బాంధవ్యాలు ఉన్న రోజానేతృత్వంలో ఒక కమిటీ వేసి ఆమె కింద ఐఏఎస్ అధికారిని కూడా నియమించనున్నారు. ఎవరైనా టాలీవుడ్ దర్శక,నిర్మాతలు హీరోలు ఏపీలో ఏదైనా షూటింగ్స్ నిమిత్తం పర్మిషన్ కావాలంటే ప్రభుత్వం తరుపున ఆమె నేతృత్వంలో ఉన్న కమిటీకి విన్నవిస్తే సరిపోతుంది. ఆమె, ఐఏఎస్ అధికారి ద్వారా షూటింగ్స్కు అనుమతులు ఇచ్చేలా చేస్తు౦ది.ఏదేమైనా రోజా పని రొట్టె విరిగి పాకంలో పడినట్లుగా ఉంది.