ఇప్పుడున్న కరోనా సంక్షోభ సమయంలో కూడా రాష్ట్ర అభివృద్ధి పనుల పై ఎటువంటి జాప్యం లేకుండా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆర్థికంగా రాష్ట్రాన్ని మరింత స్థిరపరిచేందుకు మరొక కీలక ముందడుగు వేశాడు.
అధికారం చేపట్టి సంవత్సరం రోజులు అవుతున్నా కూడా ఏ కంపెనీ లతో ఎటువంటి ఒప్పందాలు చేసుకోలేదు…. పరిశ్రమలకు అనుమతి ఇవ్వలేదు మరియు పెట్టుబడులకు పిలుపునీ ఇవ్వలేదు అని వైసీపీపై ప్రతిపక్షాల విమర్శా గళం విప్పుతూనే ఉన్నారు.
ఇలాంటి సమయంలో ప్రముఖ ఫుడ్ తయారీ సంస్థ అమూల్ తో ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇక పాడి పరిశ్రమ అభివృద్ధి పై రేపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారి సమక్షంలో అవగాహన ఒప్పందం అఫీషియల్ గా మొదలవుతుంది. ఇక దీని ద్వారా రాష్ట్రంలో లబ్దిపొందే ప్రజలు మరియు వాటి వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు.