ఆరోగ్యశ్రీ పథకం వైయస్ రాజశేఖర్ రెడ్డి కి ఎంతో మంచి పేరు సంపాదించింది. అదే రీతిలో రాణించాలని చంద్రబాబు విభజన జరిగిన తర్వాత ఏర్పడిన తరుణంలో ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అని కొత్త పథకాన్ని తీసుకు రావడం జరిగింది. కానీ చాలా వ్యాధులను తీసివేసి ఈ పథకాన్ని చంద్రబాబు అమలు చేయడంతో పెద్దగా పేరు రాలేదు.
ఇదిలా ఉండగా ప్రస్తుతం అధికారంలో ఉన్న సీఎం జగన్ గతంలో తన తండ్రి తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ పథకం మాదిరిగానే మళ్లీ ప్రవేశ పెట్టడం జరిగింది. తాను అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీ పథకంలో అదనపు వ్యాధులను తీసుకొచ్చి చాలా బెనిఫిట్ ఏపీ ప్రజలకు అందించారు. దాదాపు వెయ్యి రూపాయలు ఖర్చు దాటితే దానిని ఆరోగ్యశ్రీ పథకం కింద వచ్చేలా నిర్ణయాలు తీసుకోవటం మనకందరికీ తెలిసిందే.
కాగా మహమ్మారి కరోనా వైరస్ ని కూడా ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చి రాష్ట్రంలో ప్రజలకు కరోనా చికిత్స అందించడంలో జగన్ కీలకంగా వ్యవహరించడం కూడా జరిగింది. ఇదిలాఉండగా ఈ పథకం ద్వారా మరింత బెనిఫిట్ ప్రజలకు అందించడానికి జగన్ సర్కారు నిర్ణయం తీసుకుంది. పూర్తి విషయంలోకి వెళితే రాష్ట్రంలో పేదలు కరోనా చికిత్స ఈ విషయంలో ఏ మాత్రం ఆర్థికంగా దెబ్బతినకుండా… కరోనా వైరస్ ట్రీట్మెంట్ ని ఆరోగ్యశ్రీలో చేర్చిన జగన్… రిపోర్ట్ నెగిటివ్ వచ్చిన తర్వాత వచ్చే ఇతర సమస్యలు ఆరోగ్య శ్రీ పరిధిలో కవర్ అయ్యేవి కావు. కాగా తాజాగా కరోనా చికిత్స తర్వాత వచ్చే రోగాలు కూడా ఆరోగ్యశ్రీ పరిధిలో కవర్ అయ్యేలా జగన్ సర్కార్ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింగల్ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా ప్రైవేట్ హాస్పిటల్స్ ఎంత ధరలు వసూలు చేయాలో కూడా ఆ ఉత్తర్వుల్లో ధరలు నిర్ణయించారు. అంతేకాకుండా కరోనా నుంచి కోలుకున్న తరువాత అనారోగ్యంతో బాధపడుతున్న రోగులకు ఉపశమనం కలిగించడానికి పోస్ట్ కోవిడ్ మేనేజ్మెంట్ స్కీమ్ ని కొత్తగా ప్రవేశపెట్టారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. రాష్ట్ర పరిధిలో ఉండే ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఆసుపత్రిలో ఈ స్కీం తక్షణమే అమలు చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించినట్లు మంత్రి చెప్పారు.