పిల్లలను సరైన దారిలో పెట్టాల్సింది గురువు తర్వాత తల్లిదండ్రులే చూడాలి. వారు సక్రమమైన మార్గంలో నడిచేందుకు వారికి చేయూతనందించేది కేవలం వారితల్లిదండ్రులే.. పిల్లాడు గొప్ప పని చేసినప్పుడు ఎంత ప్రశంసించాలో.. తప్పు చేసినప్పుడు దండించడంమేమీ నేరం కాదు. కాని ఓ ఉన్నత పదవిలో ఉన్న ఓ తండ్రి తన కొడుకు కోసం చాలానే కష్టపడ్డాడోయ్.. అవును లక్షలు పెట్టి మరీ కొడుకు కోసం జేఈఈలో టాపర్ గా నిలబెట్టాడు.. దాంట్లో తప్పేముంది అనుకోవచ్చు.. అక్కడే మరి పప్పులో కాలేసేది.. అసలు కొడుకు పరీక్ష రాయకుండానే టాపర్ గా నిలిచాడంటే ఆ తండ్రి ఏ రేంజ్ డబ్బులు ఖర్చు పెట్టాడో అర్థమవుతోంది కదా.. అస్సాంకు చెందిన ఓ డాక్టర్, అతని కూమారుడు చేసిన ఈ కుట్ర తాజాగా వెలుగులోకి రావడంతో వారు కటకటాలపైలయ్యారు..
కరోనా మహమ్మారి కారణంగా అన్నీ మూతబడ్డాయి. స్కూళ్లు, కాలేజీల సంగతి ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం లేదు. దీంతో విద్యావ్యవస్థ మొత్తం అస్తవ్యస్తంగా మారింది.. దాంతో ప్రభుత్వాలు విద్యార్థులు ఈ మహమ్మారి భారిన పడకుండా ఉండేందు.. పై తరగతులకు కూడా ప్రమోట్ చేసింది. దీంతో పాటుగా విద్యార్థులెవరూ పరీక్షలు రాయకుండానే పాస్ చేసేసాయి ప్రభుత్వాలు…
అయితే తాజాగా అస్సాంకు చెందిన ఓ డాక్టర్ తన వక్ర బుద్ధిని పోనిచ్చుకోలేదు. ఈ డాక్టర్ కుమారుడు ఇటీవల విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో 99.8 శాతం మార్కులు సాధించి టాపర్ గా నిలిచాడు. అయితే ఇంకో విషయమేమంటే అతడు పరీక్ష రాయకుండానే టాపర్ గా నిలిచాడు… ఇదేలాగంటారా.. ఆ డాక్టర్ కొడుకు అందరికంటే టాపర్ గా నిలవాలని తన పరపతిని ఉపయోగించి వేరే వ్యక్తులతో పరీక్ష రాయించాడు. అందు కోసం అతడు రూ.20 లక్షలు కూడా ఖర్చు పెట్టాడు. ఇంకేముంది అనుకున్నట్టుగానే తన కొడుకును టాపర్ గా నిలబెట్టాడు..
ఈ విషయం ఆ డాక్టర్ తన స్నేహితుడికి ఫోన్ ద్వారా తెలిపాడు.. ఇంకేముందు మన పోలీసులకు ఆ విషయం తెలియగానే వారిని కటకటాలపాలు చేశారు. ఈ కుట్రలో విద్యార్థి నీల్ నక్షత్ర దాస్, అతని తండ్రి డాక్టర్ జ్యోతిర్మయి దాస్ ను పోలీసులు అరెస్టు చేశారు. వీరిపై చీటింగ్, క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఈ విద్యార్థి తండ్రి గౌహతిలో ప్రముఖ గైనకాలజిస్టు. తల్లి కూడా డాక్టర్ కావడం విశేషం. కాని అంత పెద్ద స్థాయిలో ఉండి ఇలా చీటింగ్ చేయడం బాధాకరం..