YS Viveka Case: వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ పై సీబీఐ కోర్టులో వాదనలు ముగిశాయి. న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసింది. అవినాష్ రెడ్డి సాక్ష్యులను బెదిరిస్తున్నారని, ఆయన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
దస్తగిరి, అతని కుటుంబాన్ని అవినాష్ రెడ్డి బెదిరిస్తున్నట్లు గత ఏడాది డిసెంబర్ లో ఆయన భార్య ఫిర్యాదు చేసిందని సీబీఐ కోర్టుకు తెలిపింది. సాక్ష్యులను అవినాష్ రెడ్డి ప్రభావితం చేస్తున్నారని, ఇప్పటికే దర్యాప్తును ప్రభావితం చేసేలా పలు చర్యలకు పాల్పడ్డారని వివరించింది. అవినాష్ రెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నారనీ, ఈ కేసులో ఆయనే ప్రధాన సూత్రధారి అని, కేసును ప్రభావితం చేస్తున్నారని, బెయిల్ పై బయట ఉండే అర్హత ఆయనకు లేదని అందుకు వెంటనే ఆయన బెయిల్ రద్దు చేయాలని సునీత తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.
మరో వైపు పిటిషనర్ తరపున న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు ముగిసిన తర్వాత న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసింది. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే సునీత ఇదే అంశంపై సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణ దశలో ఉంది.
YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్