Karthika deepam Today Episode: కార్తీక దీపం సీరియల్ భలే ఇంట్రెస్టింగ్ మారింది. నిన్నటి ఎపిసోడ్ లో రుద్రాణి వచ్చి కోటేష్ -శ్రీవల్లి వాళ్ళ బిడ్డను తీసుకుని వెళ్లిపోవడం, వాళ్ళు వెళ్లి పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేస్తామని బయలుదేరుతారు. ఇక ఈరోజు ఎపిసోడ్ లో కార్తీక్.. కోటేశ్-శ్రీవల్లికి అండగా ఉంటానంటాడు. కానీ దీప మాత్రం వద్దని అడ్డుపడుతుంది. సాయం చేసే విషయంలో నాకన్నా నువ్వే ముందుంటావు..నాకేమైనా అవుతుందేమో అనే భయంతో వద్దన్నావు కదా అంటాడు. మీరు వెళితే పిల్లలు-నేను భయంగా ఎదురుచూడాలని అంటుంది దీప.నాన్న గొడవల్లో జోక్యం చేసుకోవద్దని పిల్లలు చెప్పడంతో సరే అంటాడు కార్తీక్.మరోపక్క బాబుని తీసుకొచ్చిన రుద్రాణి బాబుని నిద్రపుచ్చేందుకు తన అనుచరులను పాట పాడమంటుంది.
రుద్రాణి ఇంటికి పోలీసులు రావడం చూసి అవాక్ అయిన అనుచరులు :
ఈలోపు పోలీసులను తీసుకుని శ్రీవల్లి-కోటేశ్ రుద్రాణి దగ్గరకు వస్తారు. వాళ్ళని చుసిన రుద్రాణి నా ఇంటికే పోలీసులు వస్తారా అని కోపంతో ఊగిపోతుంది. ఇన్నాళ్లూ మీ మీద కంప్లైంట్ ఇవ్వడానికి భయపడ్డారు కాబట్టి నేను ఏం చేయలేకపోయానంటుంది ఎస్ ఐ. అసలు శ్రీవల్లి కంప్లైంట్ ఇస్తే తీసుకోవడమే తప్పు కాకుండా పైగా నా ఇంట్లో అడుగుపెట్టడం ఇంకా పెద్ద తప్పు అంటుంది రుద్రాణి. ఆ మాటలు విన్నా ఎస్ ఐ కోపంతో ఆపు అని అరుస్తుంది.నన్ను ఎదిరించి ఈ ఊళ్లో ఉంటాననుకుంటావా అనగానే.. ఇప్పటికే ట్రాన్స్ ఫర్ ఆర్డర్ వచ్చింది వెళ్లేముందు పాతలెక్కలు సెట్ చేసే వెళతా అంటుంది ఎస్ ఐ. ఇంకా చేసేది లేక బాబును శ్రీవల్లికి అప్పగిస్తుంది రుద్రాణి. తప్పు చేస్తున్నావు మాధురి అని ఎస్ ఐని ఉద్దేశించి మాట్లాడంతో తప్పు గురించి నువ్వు మాట్లాడుతున్నావా రుద్రాణి అని ఫైర్ అవుతుంది.కాసేపటి తర్వాత డోర్ తీసుకుని బయటకు వచ్చిన రుద్రాణి కోపంతో నాపైనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పెద్ద తప్పు చేశావ్ అని మనసులో అనుకుంటూ పోలీస్ స్టేషన్ కి వెళుతుంది.
కార్తీక్, దీపలు ఎక్కడున్నారో సౌందర్యకు తెలిసిపోతుందా..?
సీన్ కట్ చేస్తే రత్న సీతకు కార్తీక్ ఫోన్ దొరికిన బిచ్చగాడు దొరుకుతాడు. అతన్ని సౌందర్య ఇంటికి తీసుకొస్తుంది రత్నసీత . మేడం కార్తీక్ సార్ ఫోన్ షాప్ లో అమ్ముతుంటే తీసుకొచ్చా అని రత్నసీత చెప్పడంతో నేను కార్తీక్ ఫోన్ నేను కొట్టేయలేదు నాకు దొరికింది అని చెబుతాడు బిచ్చగాడు. ఆ బాబు బస్ ఎక్కడానికి ముందు ఒక చోట ఫోన్ పడేసి అక్కడినుంచి బస్సెక్కి వెళ్లిపోయిన విషయం చెబుతాడు బిచ్చగాడు. ఇదే విషయం గురించి డబ్బులు పంపించి ఓ మేడం అడిగింది కదా ఆ విషయం చెప్పాలా వద్దా అనే ఆలోచించేలోపే సౌందర్య థ్యాంక్యూ అని, నీకు డబ్బులిస్తాను వాళ్లు ఎక్కిన చోటే బస్సెక్కి ప్రతి స్టాప్ లోనూ దిగి వాళ్లెక్కడున్నారో కనిపెట్టు అని అడుగుతుంది.అక్కడితో ఆ సీన్ అయిపోతుంది.
తమ్ముడి కోసం అక్కల ఆవేదన :
మరొపక్క సౌర్య, హిమ వచ్చి అమ్మా తమ్ముడు ఇంకా రాలేదా అని దీపను అడగగా వస్తారులే కాసేపు మాట్లాడకుండా కూర్చోండని దీప చెబుతుంది. ఇంతలో బాబుని తీసుకుని శ్రీవల్లి-కోటేశ్ రావడం చూసి పిల్లలు పరిగెత్తుకుని వెళ్లిపోతారు. ఇంట్లోకి వచ్చిన వాళ్ళను అక్కడ ఏమైనా గొడవ జరిగిందా అని దీప అడిగితే..ఎస్ ఐ వచ్చి రుద్రాణికి గట్టిగా చెప్పి బాబుని ఇప్పించారని చెబుతుంది శ్రీవల్లి.కానీ అక్కా రుద్రాణి పోలీస్ స్టేషన్ కి వెళ్లిందన్నమాటే కానీ తిరిగి వచ్చాక ఏమి చేస్తుందో అని అనే భయం ఉందని శ్రీవల్లి చెప్పగానే.. ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదంటారు దీప-కార్తీక్. మళ్లీ పంతులుగారికి ఫోన్ చేసి రమ్మను నామకరణం చేద్దాం అంటుంది దీప.
అత్తింటి పరువు కాపాడిన శ్రావ్య…. ఎలాగంటే..??
మళ్ళీ సీన్ సౌందర్య వాళ్ళ ఇంటిలో ఓపెన్ అవుతుంది.డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న సౌందర్య …కార్తీక్,పిల్లల్ని తలుచుకుని ఇప్పుడు ఎక్కడున్నారో ఏమో అని బాధపడుతుంది. సరేగాని శ్రావ్య మీ అమ్మానాన్నలకి ఈ విషయం తెలుసా అని అడిగితే.. బావగారు, దీపక్క పిల్లలు వైజాగ్ షిప్ట్ అయ్యారని చెప్పానంటుంది శ్రావ్య. అబద్ధం చెప్పి అయినా అత్తింటి పరువు నిలబెట్టావమ్మా అని అంటాడు ఆనందరావు.ఇక్కడితి ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. మరి రేపటి ఎపిసోడ్ లో స్టేషన్ నుంచి తిరిగివచ్చిన రుద్రాణి కోటేష్ -శ్రీవల్లి మీద పగ తీర్చుకుంటుందా… లేదా అనేది చూడాలి. !