భారత్-చైనా గొడవల్లో అమరవీర వీరుడైన తెలంగాణ ముద్దుబిడ్డ సంతోష్ బాబు ఇంటికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లారు. ప్రస్తుతం ఆయన అతని ఇంటిలోనే ఉండగా…. అతని కుటుంబ సభ్యులను పరామర్శించారు.అలాగే అతని భార్య సంతోషి కి 4 కోట్ల రూపాయల చెక్కు తో పాటు ….డిప్యూటీ కలెక్టర్ గా నియామక పత్రాన్ని అందించాడు. ఇకపోతే కల్నల్ సంతోష్ తల్లిదండ్రులకు కోటి రూపాయల చెక్కును అందించారు. అలాగే వారికి 500 గజాల నివాస స్థలం యొక్క పత్రాన్ని కూడా అందజేశారు.
సంతోష్ ఫోటో కి నివాళులు అర్పించిన కేసీఆర్ తర్వాత చాలా సేపు వారితో కూర్చుని చర్చించారు సంతోష్ అమ్మానాన్నలతో పాటు భార్యాబిడ్డలను కూడా పరామర్శించిన కెసిఆర్ రాష్ట్ర ప్రజలు అతని ఎనలేని త్యాగాన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు అని చెప్పారు.