Kiara advani: టాలీవుడ్లో భరత్ అనే నేను సినిమాతో పరిచయమైన హాట్ హీరోయిన్ కియారా అద్వానీ. ఆ తర్వాత వినయ విధేయ రామ సినిమా చేసి ఫ్లాప్ అందుకుంది. అయితే మొదటి సినిమా తర్వాత ఫ్లాప్ రాకపోయి ఉంటే టాలీవుడ్లో సెటిలయ్యేదేమో. కానీ అలా జరగకపోవడంతో బాలీవుడ్లో ఇప్పుడు క్రేజీ హీరోయిన్గా మారింది. ధోనీ సినిమాతో పేరు తెచ్చుకున్న కియారా అద్వానీ ఆ తర్వాత అడల్ట్ వెబ్ సిరీస్ లస్ట్ స్టోరీస్, తెలుగులో విజయ్ దేవరకొండ, సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో వచ్చిన అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ సినిమాతో భారీ హిట్స్ అందుకొని అక్కడ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారింది.
ఆ తర్వాత టాలీవుడ్లో సినిమా చేసేంత ఖాళీ సమయం దొరకనంత బిజీగా హిందీ సినిమాలతో గడుపుతోంది. ఎక్కువగా స్టార్ హీరో అక్షయ్ కుమార్ సినిమాలలో అవకాశం దక్కించుకోవడం గొప్ప విషయం. బాలీవుడ్ లో కియారా ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. ఆమె నటించిన ‘షేర్షా’ చిత్రం ఇటీవల ఓటీటీలో విడుదలైంది. ఇందులో కియారా పర్ఫార్మెన్స్ చాలా బావుంది. ప్రేక్షకులను మరోసారి తన డీసెంట్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. ఇక విమర్శకులు సైతం అద్భుతమని ప్రశంసిస్తున్నారు. ఈ సినిమాలో సిద్దార్థ్ మల్హోత్ర హీరోగా నటినంచాడు.
Kiara advani: ‘భూల్ భూలయ్య 2, జుగ్ జుగ్ జీయో, మిస్టర్ లేలె’ సినిమాలు చేస్తోంది.
కాగా ప్రమోషన్స్లో పాల్గొంటూ ఇంటర్వ్యూస్ ఇస్తోంది. ఇందులో భాగంగానే ఆమె హీరోయిన్ కాకపోయి ఉంటే చైల్డ్ సైకాలజీ స్టడీ చేసేదాన్నని చెప్పింది. చాలా మంది డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాను అంటారు. ఇక కొంతమంది యాక్టర్ కాకపోయి ఉంటే టీచర్ అయ్యేవారమని, లేదా పైలెట్ అయ్యేవారమని, బిజినెస్ చేసుకునేవారమని..ఇలా రకరకాలు చెప్తుంటారు. కానీ కియారా మాత్రం చైల్డ్ సైకాలజీ స్టడీ చేసేదాన్నని చెప్పడం ఆసక్తికరం. ఇక కియారా శంకర్ – చరణ్ ల పాన్ ఇండియన్ సినిమాలో నటించబోతోంది. అలాగే ‘భూల్ భూలయ్య 2, జుగ్ జుగ్ జీయో, మిస్టర్ లేలె’ సినిమాలు చేస్తోంది.