సరిగ్గా 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆంధ్ర ప్రదేశ్ బిజెపి పార్టీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు కన్నా లక్ష్మీనారాయణ. గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా రాణించిన కన్నా లక్ష్మీనారాయణ గుంటూరు మరియు ప్రకాశం జిల్లాలో మంచి బలమైన నేతగా పేరుంది. వైయస్ హయాంలో మంత్రిగా కూడా పని చేయడం జరిగింది.
అయితే విభజన జరిగిన తర్వాత చాలా వరకు సైలెంట్ అయినా కన్నా లక్ష్మీనారాయణ… సరిగ్గా గత సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీలో చేరి అధ్యక్ష పదవిని చేపట్టి అందరికీ షాక్ ఇచ్చారు. వాస్తవానికి ఆ సమయంలో వైసీపీ లోకి కన్నా లక్ష్మీనారాయణ వస్తారని భావించారు. కానీ చివరి నిమిషంలో బిజెపి నేతలు ఆయనతో మాట్లాడి అధ్యక్షపదవిని ఇవ్వటంతో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నాట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా ఈ ఏడాదిలో అర్ధాంతరంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి నుండి ఆయనను తప్పించడంతో అందరూ ఒక్కసారిగా షాక్ తిన్నారు. వైసీపీ ప్రభుత్వం పై పోరాడుతున్న గాని కన్నా లక్ష్మీనారాయణ ని పదవి నుంచి తొలగించడం పట్ల అనేక కామెంట్లు వచ్చాయి. అయితే దీని వెనుక ప్రధాన కారణాలు చాలా వరకు కన్నా లక్ష్మీనారాయణ టిడిపి డైరెక్షన్ లో పని చేస్తున్నట్లు అప్పట్లో కామెంట్లు వచ్చాయి. ఇదిలా ఉంటే కాపు సామాజిక వర్గం లో బలమైన నేతగా పేరొందిన కన్నా లక్ష్మీనారాయణ త్వరలోనే పార్టీ మారే అవకాశాలు ఉన్నాయని సరికొత్త టాకు ఏపీ రాజకీయవర్గాలలో నడుస్తోంది. పూర్తి మేటర్ లోకి వెళితే త్వరలోనే బిజెపి పార్టీకి రాజీనామా చేసి కీలకమైన పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే టీడీపీ నుండి కన్నా లక్ష్మీనారాయణకు భారీ ఆఫర్లు వస్తున్నట్లు సమాచారం.