రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్ర పోషిస్తున్న సినిమా ఆది పురుష్. ఈ సినిమాను ఇటీవలే ప్రకటించారు. నిజానికి ప్రభాస్ ఈ సినిమా ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికే రెండు ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి. ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమా చేస్తోన్న విషయం తెల్సిందే.
ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల నుండి తిరిగి ప్రారంభమవుతుంది. ఇక వరస షెడ్యూల్స్ తో ఈ ఏడాది చివరికి రాధే శ్యామ్ షూట్ ను పూర్తి చేయాలనుకుంటున్నారు. ఇక మరోవైపు రాధే శ్యామ్ పూర్తవ్వగానే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ను సెట్స్ పైకి తీసుకువెళ్లనున్నాడు. ఈ సినిమా కోసం వెటరన్ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు మెంటర్ గా పనిచేయనున్నాడు. సింగీతం ఈ సినిమాకు పనిచేస్తున్నారు అంటే కచ్చితంగా టైమ్ మెషిన్ కాన్సెప్ట్ ఉంటుందని భావిస్తున్నారు.
ఇలా ప్రభాస్ ఫుల్ బిజీ షెడ్యూల్ తో ఉన్నా కానీ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ చెప్పిన కథను ఓకే చేసాడు. ఆది పురుష్ తో సినిమా అనౌన్స్మెంట్ జరిగింది. ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులను ఆకర్షిస్తుంది అని రాజమౌళి, తదితర దర్శకులు ట్వీట్ చేసారు. భారతదేశంలో రామ మందిరం నిర్మిస్తున్న వేళ రాముడి కథతో సినిమా రావడం నిజంగా అద్భుతమని అన్నారు. అటు రాజమౌళి కానీ, నాగ్ అశ్విన్ కానీ రాముడిలా ప్రభాస్ ఆకట్టుకుంటాడనే అన్నారు.
అయితే ఒక వర్గం బాలీవుడ్ మీడియా మాత్రం ఈ విషయంలో మరో భిన్నమైన వాదనను తెర మీదకు తెస్తోంది. ఈ కథ రాముడిదే కానీ రామాయణం కాదుట. అంటే ప్రభాస్ పాత్ర తీరుతెన్నులు రాముడిలా ఉంటాయట. అలాగే సైఫ్ అలీ ఖాన్ లంకేశ్ పాత్ర చేస్తున్నా అది రావణాసురుడు పాత్ర అయితే కాదుట. అలాగే రామాయణంలోని పలు పాత్రల తీరుతెన్నులను ఇందులోకి తీసుకున్నారు కానీ పూర్తిగా రామాయణం కథ అయితే కాదని అంటున్నారు. చూడాలి మరి.