కేవలం మాస్క్ పెట్టుకోమని సూచించినందుకే ఒక వ్యక్తి కోపంతో ఊగిపోయాడు. మాస్క్ పెట్టుకోమని చెప్పిన వ్యక్తిపై కత్తితో దాడి చేసాడు. ఇప్పుడా వ్యక్తి తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా తీగలగుట్టపల్లిలోని ఒక బార్బర్ షాపులోకి మాస్క్ లేకుండా ఒక వ్యక్తి వచ్చాడు.
అతణ్ణి మాస్క్ పెట్టుకోమని మరో కస్టమర్ సూచించాడు. ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి దిగారు. వెంటనే ఆ కస్టమర్ మరో కస్టమర్ పై కత్తితో దాడి చేసాడు. తీవ్ర గాయాల పాలైన మరో కస్టమర్ ను పోలీసులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి పోలీసులు కేసును విచారిస్తున్నారు. కేవలం మాస్క్ కోసం ఇలా కత్తితో దాడి చేసుకోవడం ఏమిటని స్థానికులు వాపోతున్నారు.