దేశానికి బాగా ఆదాయం తెచ్చి పెట్టె వాటిలో రైల్వే శాఖ ఒకటి. ఒకానొక సమయంలో దేశంలో రైల్వే అనేసరికి చాలా దారుణంగా సదుపాయాలు ఉండేవి. ప్లాట్ ఫారం మీదే టాయిలెట్లు కనీసం రైల్వేస్టేషన్లో తాగడానికి నీరు లేని పరిస్థితి ఆయా రైల్వేస్టేషన్లలో ఉండేవి. కాని కాలం మారాక రైల్వే శాఖలో చాలా మార్పులు రావటం చోటుచేసుకున్నాయి.
దేశంలో ప్రతీ రైల్వే ప్లాట్ ఫారం మీద ఎక్స్ లెటర్ లు, లిఫ్టులు సిస్టమేటిక్ గా ఎప్పటికప్పుడు క్లీనింగ్ అదే విధంగా ప్రతి రైల్వే స్టేషన్లో టాయిలెట్లు అందుబాటులోకి రావడం జరిగాయి. ఇటువంటి తరుణంలో తాజాగా రైల్వే రవాణా రంగంలో మోడీ సర్కార్ అద్భుతమైన ఆలోచన కు శ్రీకారం చుట్టింది. మేటర్ లోకి వెళ్తే డబుల్ డెక్కర్ బస్సు లాగా.. త్వరలో రైల్వేలో డబుల్ డెక్కర్ ట్రైన్స్ అందుబాటులోకి తీసుకురావడానికి మోడీ సర్కార్ రెడీ అయింది.
అయితే వీటిని దేశంలో సరుకు రవాణా కి వినియోగించాలని కేంద్రం డిసైడ్ అయ్యింది. ఈ విధానం వల్ల 50 శాతం ఖర్చు తగ్గటమే కాక సరుకు ఎక్కువ తీసుకెళ్లే పరిస్థితి ఉండటంతో..చాలామంది మోడీ సర్కార్ తీసుకురాబోతున్న డబుల్ డెక్కర్ ట్రైన్స్ ప్రయోగం సూపర్ అంటూ ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. ఇది భారత రైల్వే అధ్యాయంలోని సరికొత్త చరిత్ర అంటూ మరి కొంతమంది అభివర్ణిస్తున్నారు.