తెలుగు దేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకుని అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తు న్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే టీడీపీ అదినేత చంద్రబాబు దాదాపు ప్రజల్లోనే ఉంటు న్నారు. ఆయనతోపాటు.. ఆయన సతీమణి కూడా రాజకీయ అరంగేట్రం నేరుగా చేయకపోయినా.. నారా భువనేశ్వరి కూడా ప్రజల మధ్యే తిరుగుతున్నారు. వారానికి 4 రోజుల పాటు ఆమె నిజం గెలవాలి యాత్ర ద్వారా మహిళా సెంటిమెంటును అస్త్రం గా చేసుకుని రాజకీయాలే చేస్తున్నారు.
మరోవైపు.. చంద్రబాబు తనయుడు, మాజీ మంత్రి నారా లోకేష్ కూడా.. శంఖారావం సభలను తిరిగి ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు. అంటే.. మొత్తంగా నారా కుటుంబం ఎన్నికలపై బాగానే ఫోకస్ చేసింది. అయితే.. కథ ఇక్కడితో అయిపోలేదు. టీడీపీ నుంచి మరిన్ని అస్త్రాలు రెడీ అవుతున్నాయి. తాజాగా టీడీపీ వర్గాలు చెబుతున్న సమాచారం మేరకు.. నందమూరి కుటుంబం కూడా ఎన్నికల ప్రచారానికి రెడీ అవుతోంది.
నందమూరి బాలకృష్ణ వచ్చే రెండు మాసాల పాటు ప్రజల్లోనే ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తు తం ఆయన సినిమాలో బిజీగా ఉన్నప్పటికీ.. దీని షూటింగ్ పూర్తయిన తర్వాత.. సుమారు రెండు మాసాల పాటు మరో షెడ్యూల్ లేకుండా రాజకీయాలకే పరిమితం కానున్నారని సమాచారం. ఇక, ఆయన సతీమ ణి వసుంధర కూడా.. ప్రజల మధ్యకు రానున్నారు. ఆమె ఇప్పటికే హిందూపురంలో తరచుగా పర్యటనలు చేస్తున్నారు. నాయకులను, కార్యకర్తలను మానిటరింగ్ చేస్తున్నారు.
ఇక, నందమూరి కుటుంబం నుంచి వర్ధమాన హీరోలుగా ఉన్న నందమూరి కల్యాణ్రామ్ సహా యువత అంతా ఎన్నికల బాట పట్టనుంది. ప్రస్తుతం ముగ్గురు నందమూరి యువకులకు.. హైదరాబాద్లో రాజకీయ శిక్షణ ఇస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వీరిని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక, వీరితోపాటు.. నందమూరి సుహాసిని, నారా బ్రాహ్మణి.. మహిళలను కేంద్రంగా చేసుకుని ప్రచారానికి దిగనున్నారు. వీరి కోసం రెండు అధునాతన బస్సులకు ఆర్డర్ ఇచ్చినట్టు సమాచారం. వీరు వాటిలోనే ఉండి సుమారు 20 నుంచి 30 రోజుల పాటు ప్రచారం చేయనున్నట్టు తెలిసింది.