టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోల లో వరుస విజయాలతో మంచి జోరు మీద హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాలతో హ్యాట్రిక్ విజయాలు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతి పండుగకు రిలీజ్ అయిన సరిలేరు నీకెవ్వరు సినిమా మహేష్ కెరీర్ లోనే రికార్డు స్థాయి కలెక్షన్లు కొల్లగొట్టింది. ఇటువంటి తరుణంలో ఏప్రిల్ మాసంలో నెక్స్ట్ సినిమా మహేష్ తో చేయాలని అంతా ప్రిపేర్ అయి ఉన్న సమయంలో కరోనా వైరస్ రావడంతో వేసుకున్న ప్లాన్స్ అన్ని తలకిందులయ్యాయి.
కాగా లాక్డౌన్ సమయంలో మహేష్ తన నెక్స్ట్ సినిమా “గీతా గోవిందం” డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్నట్లు తండ్రి కృష్ణ పుట్టినరోజు నాడు ప్రకటించడం జరిగింది. అంతే కాకుండా సినిమాకి సంబంధించి పోస్టర్ తో పాటు ఫస్ట్ లుక్ అతిధి తరహాలో హెయిర్ స్టైల్ పెంచి రిలీజ్ చేసి అభిమానులకు సినిమాపై ఆసక్తిని ఒక్కసారిగా పెంచారు. ఆ తర్వాత ఆగస్టు 9వ తారీఖు మోషన్ పోస్టర్ రిలీజ్ చేసి అభిమానులకు సినిమాపై అంచనాలు మరింతగా పెంచారు.
ఇదిలా ఉండగా చాలావరకు ప్రభుత్వాల నుండి పర్మిషన్లు రావడంతో సినిమా షూటింగ్ త్వరలో స్టార్ట్ చేయాలని సినిమా యూనిట్ రెడీ అయిందట. ఇదిలా ఉండగా ఈ సినిమాకు బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ విద్యాబాలన్ నటించనున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. డర్టీ పిక్చర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న విద్యాబాలన్…. బాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక ప్రముఖ సినిమాలలో నటించడం జరిగింది. కాగా సర్కార్ వాడి పాట సినిమా లో అతి కీలకమైన పాత్ర కి ఈ హీరోయిన్ అయితే కరెక్ట్ అని డైరెక్టర్ పరుశురాం మహేష్ తో చర్చించి…. ఆమెతో మాట్లాడటానికి రెడీ అయినట్లు సమాచారం. త్వరలో విద్యాబాలన్ ఓకే చేబితే అధికారిక ప్రకటన సినిమా యూనిట్ చేయనున్నట్లు ఇండస్ట్రీలో టాక్.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!