BRO: హైదరాబాద్ శిల్పకళా వేదికలో “BRO” ప్రీ రిలీజ్ ఈవెంట్ అభిమానుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మెగా హీరోలు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ తో పాటు సినిమా హీరోయిన్స్ పవన్ కళ్యాణ్ మరియు దర్శకులు సముద్రఖని హాజరు కావడం జరిగింది. ఇక ఇదే కార్యక్రమానికి చాలాకాలం తర్వాత కమెడియన్ బ్రహ్మానందం హాజరయ్యారు. బ్రహ్మానందం సినిమా కార్యక్రమాలకు హాజరై చాలా సంవత్సరాలు కావడంతో ఒక్కసారిగా సినిమా స్టేజిపై బ్రహ్మీ కనిపించడంతో.. సభా ప్రాంగణం మొత్తం దద్దరిల్లింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గురించి బ్రహ్మానందం మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే స్థాయి ఉన్న అతికొద్ది మందిలో నేను ఒకడినని నమ్ముతున్నాను. ఆయనకి 18 – 20 ఏళ్లు ఉన్నప్పటి నుంచి నేను చూస్తూ వస్తున్నాను” అని అన్నారు. ఈ సినిమాలో నేను ఒక చిన్న పాత్రను చేశాను. పవన్ తో కలిసి నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. పవన్ కల్యాణ్ నవ్వితే పత్తికాయ విచ్చుకున్నట్టుగా స్వచ్ఛంగా ఉంటుంది. ఆయన నవ్వు .. మనసు కూడా అంతే తెల్లగా ఉంటాయి. ఆయనలో ఏ వైపు నుంచి చూసినా మంచితనమే కనిపిస్తుంది .. ఆయన ఒక దైవాంశ సంభూతుడు” అని అన్నారు. పవన్ కల్యాణ్ విజయానికి అన్ని విధాలుగా తోడ్పడాలని అభిమానులను కోరుతున్నాను. ఈ నాలుగు మాటలు చెప్పడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను.
ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఈ వేదిక ద్వారా మరో సారి టీమ్ కి ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను” అన్నారు. చాలాకాలం తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగటంతో అభిమానులు శిల్పకళ వేదికలో గోల గోల చేయడం జరిగింది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదలైన పాటలు మరియు పోస్టర్ ఇంకా టీజర్, ట్రైలర్ అన్నీ కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి. జూలై 28వ తారీకు ఈ సినిమా విడుదల కాబోతుంది.
Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!