చాలా రోజుల తర్వాత తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పనిలో పడ్డ డైరెక్టర్ పరశురామ్కు అనుకోని ఆటంకం ఎదురైంది. గతంలో తాను ఇచ్చిన అడ్వాన్స్ తనకు తిరిగి ఇచ్చేయమంటూ సీనియర్ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ ఒత్తిడి తెస్తున్నాడు. ఈ మేరకు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ను కూడా ప్రసాద్ సంప్రదించాడు. వివరాల్లోకి వెళితే.. తనతో సినిమా చేయాలంటూ రూ.25 లక్షలు అడ్వాన్స్గా పరశురామ్కు ప్రసాద్ ఇచ్చాడు. 2008లో డబ్బులు ఇవ్వగా ఇప్పటి వరకు దానిపై ఎలాంటి ముందడుగు పడలేదు. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ప్రసాద్ డబ్బులు అడిగాడు. అంతేకాదు రూ.25లక్షలకు నష్టపరిహారంతో కలిపి ఆరు కోట్లు ఇప్పించాలంటూ ఫిల్మ్ చాంబర్ను విజ్ఞప్తి చేశాడు.
ఈ తతంగం ఇలా నడుస్తుంటే.. పరశురామ్తో సినిమాకు రెడీ అయిన నాగచైతన్య, 14 రీల్స్ సంస్థ ఇప్పుడు ఆ సినిమాకు బ్రేక్ ఇచ్చాయట. ముందు ఈ సమస్యను పరిష్కరించుకుని రమ్మని ఖరాఖండిగా చెప్పాయట. మరోవైపు గతంలో పరశురామ్కు అడ్వాన్స్లు ఇచ్చిన మిగిలిన నిర్మాతలు.. అతనిపై ఒత్తిడి తెచ్చేందుకు రెడీ అవుతున్నాయట.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!