ఇండస్ట్రీలో కామెడీ నేపథ్యంలో సినిమాలు చేసే డైరెక్టర్ లలో మారుతి ఒకరు. ప్రేక్షకుల నాడి తెలుసుకొని.. తనదైన శైలిలో సినిమాలు తెరకెక్కించి వరుస పెట్టి విజయాలు సాధిస్తున్నారు. కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడిన కామెడీని తెరపై పండిస్తూ ఉన్న మారుతితో పెద్ద పెద్ద స్టార్ హీరోలు సైతం సినిమాలు చేయడానికి ఇప్పుడు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
ఇటువంటి తరుణంలో ఇటీవలే గోపీచంద్ హీరోగా “పక్కా కమర్షియల్” అనే సినిమా చేయడం తెలిసిందే. “పక్కా కమర్షియల్” మంచి విజయం సాధించింది. అయితే ఈ సినిమా తర్వాత మారుతి లిస్టులో దాదాపు నలుగురు హీరోలు ఉన్నారు. ప్రభాస్, చిరంజీవి, నాని, సాయి ధరమ్ తేజ్. ఈ నలుగురు హీరోలలో ప్రభాస్ తో చేయబోయేది అతి పెద్ద ప్రాజెక్ట్…అంట. ఈ దసరా నుండి ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ మారుతి స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం.
ప్రస్తుతం ప్రభాస్ మూడు సినిమాలు చేస్తున్నారు. “కేజిఎఫ్” డైరెక్టర్ ప్రశాంత్ నీల్..దర్శకత్వంలో “సలార్”, ఓమ్ రౌత్ దర్శకత్వంలో “ఆది పూరూష్”, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో “ప్రాజెక్ట్ కే”. ఈ మూడు సినిమాల షూటింగ్ లలో ప్రభాస్ బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే ప్రభాస్ తో చేయబోయే సినిమా అతి తక్కువ టైంలోనే కంప్లీట్ చేసే రీతిలో మారుతి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టు తర్వాత నానితో మారుతి సినిమా చేయబోతున్నారట. గతంలో నానితో మారుతి “బలే బలే మగాడివోయ్” అనే సినిమా చేయడం జరిగింది. ఈ రెండు తర్వాత మెగా హీరోలతో మారుతి సినిమా చేయనున్నట్లుఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. “పక్కా కమర్షియల్” ప్రీ రిలీజ్ వేడుక టైంలో మెగాస్టార్ చిరంజీవి.. అతిథిగా వచ్చి మారుతీకి సినిమా ఆఫర్ ఇవ్వడం జరిగింది. దింతో మెగాస్టార్ కోసం కూడా ప్రస్తుతం మారుతీ స్క్రిప్ట్ రెడీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!