మెగాస్టార్ రామ్ చరణ్, ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో ఓ పాన్ ఇండియా మూవీ రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ కెరీర్లో ఇది 15వ ప్రాజెక్ట్ కావడంతో.. `ఆర్సీ 15` వర్కింగ్ టైటిల్తో ఈ మూవీని పట్టాలెక్కించారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది.
అలాగే శ్రీకాంత్, జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్లు ఈ మూవీని హై బడ్జెట్తో నిర్మిస్తుండగా.. మ్యూజిక్ సెన్షేషన్ తమన్ స్వరాలు అందిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి `సర్కారోడు`, `అధికారి`, `సిటిజన్` టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి.
క్రేజీ టాక్.. `ఆర్సీ 15` కోసం రక్కమ్మను రంగంలోకి దింపుతున్న శంకర్..!?
ఇదిలా ఉంటే.. ఈ మూవీని సంబంధించి చరణ్ ఫ్యాన్స్ని ఖుషీ చేసే ఓ అదిరిపోయే గుడ్న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ఇంతకీ విషయం ఏంటంటే.. `ఆర్సీ 15` విడుదలకు తేదీ ఖరారు అయిందట. లేటెస్ట్ సమాచారం ప్రకారం.. ఈ సినిమా 30 మార్చి 2023 అంటే శ్రీరామ నవమి నాడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుందని తెలుస్తోంది.
రామ్ చరణ్ కెరీర్లో సూపర్ హిట్స్గా నిలిచిన రంగస్దలం, ఆర్ఆర్ఆర్ చిత్రాలు మార్చి నెలలోనే విడుదల అయ్యాయి. పైగా మార్చి 30 నుండి ఏప్రియల్ 7వ తేదీ వరకు వరుస సెలవులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ఆ డేట్ను లాక్ చేశారని అంటున్నారు. అధికారిక ప్రకటన లేకపోయినా.. ఇప్పుడీ తేదీ నెట్టింట వైరల్గా మారింది. దీంతో చరణ్ ఫ్యాన్స్ మస్తు ఖుషీ అవుతున్నారు.