Krithi Shetty: మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన `ఉప్పెన` మూవీతో తెలుగుతో ఇండస్ట్రీలోకి గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి.. మొదటి చిత్రంతో సూపర్ డూపర్ హిట్ను ఖాతాలో వేసుకుంది. ఆ వెంటనే ఈమె చేసిన శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు చిత్రాలు కూడా మంచి సాధించాయి.
దీంతో హ్యాట్రిక్ హిట్స్తో స్టార్ హీరోయిన్గా కృతి మారిపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ రామ్ పోతినేనితో `ది వారియర్`, నితిన్తో `మాచర్ల నియోజవర్గం` మరియు సుధీర్ బాబుతో `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` చిత్రాల్లో చేస్తోంది. అలాగే మరిన్ని సినిమాల్లోనూ ఆమెను తీసుకోవాలని దర్శకనిర్మాతలు క్యూ కడుతున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ బ్యూటీకి ఓ బిగ్ ఆఫర్ వచ్చిందని తాజాగా ఓ టాక్ బయటకు వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస రీమేక్ చిత్రాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈయన లైన్లో పెట్టిన రిమేక్ ప్రాజెక్ట్స్లో తమిళ్ హిట్ `వినోదయ సీతమ్` ఒకటి. ఇందులో సాయి ధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ కలిసి నటించబోతున్నారు.
తమిళంలో సముద్రఖని ప్రధాన పాత్ర పోషించడంతో పాటు ఆయనే ఈ చిత్రాన్ని స్వయంగా డైరెక్ట్ చేశారు. అయితే తెలుగుతో సముద్రఖనినే దర్శకత్వం వహించబోతున్నాడు. అయితే ఈ చిత్రంలో హీరోయిన్గా నటించే ఛాన్స్ కృతి శెట్టికి దక్కిందట. ఇప్పటికే సంప్రదింపులు కూడా పూర్తి అయ్యాయట. అయితే ఈ రీమేక్లో పవన్కు జోడీగా కాకుండా సాయి ధరమ్ తేజ్ సరసన కృతి నటించబోతోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారం ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!