వివాదస్పద దర్శకుడు తెరకెక్కించిన రామ్గోపాల్ వర్మ వివాదస్పద చిత్రం `లక్ష్మీస్ ఎన్టీఆర్` ఏపీలో మే1న విడుదల కానుంది. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీపార్వతి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలను సినిమాగా వర్మ తెరకెక్కించారు. మార్చి 29న సినిమాను విడుదల చేయాలనుకున్నారు. అయితే ఎన్నికలు ముందు ఓటర్స్ను ప్రభావితం చేసేలా సినిమా ఉందని టీడీపీ నాయకులు ఎన్నికల కమీషన్కు పిర్యాదు చేయడంతో పాటు కోర్టులో కేసులు వేశారు. కేసులను పరిశీలించిన
హైకోర్టు సినిమా విడుదలను ఎన్నికల వరకు ఆపాలంటూ ఆర్డర్స్ జారీ చేసింది. నిర్మాతలు సుప్రీంకోర్టును ఆశ్రయించినా కూడ ఫలితం లేకుండా పోయింది. హైకోర్టు ఫలితంపైనే సినిమా విడుదలచేయాలని తీర్పు చెప్పి నిర్మాతలను నిరాశ పరిచింది. అత్యున్నత న్యాయస్థానం తీర్పుతో దర్శక నిర్మాతలకు ఎదురుచూపులు తప్పలేదు. ఆంధ్రప్రదేశ్లో తప్ప `లక్ష్మీస్ ఎన్టీఆర్` అంతటా విడుదలైంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా సినిమా విడుదలకు సన్నద్ధమవుతుంది. కోర్టు వ్యవహారం క్లియర్ అయినట్లుందేమో. మే 1న సినిమాను ఏపీలో విడుదల చేస్తున్నట్లు ఆర్జీవీ ప్రకటించారు. దీనిపై కొందరు మాకు ఫ్రీగా టికెట్స్ ఇచ్చిన చూసే ఓపిక లేదంటూ అంటున్నారు. మరి ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ ఎలాంటి ఫలితాన్ని రాబట్టుకుంటుందో చూడాలి.
previous post
next post