Telangana Elections: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గురువారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 119 నియోజకవర్గాలలో పోలింగ్ జరుగుతూ ఉంది. ఈ క్రమంలో కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఈవీఎంలు మొరాయించటంతో ఎన్నికల అధికారులు అప్రమత్తమయ్యారు. ఇదే సమయంలో ఎక్కడా కూడా డబ్బు పంపిణీ మద్యం పంపిణీ జరగకుండా కూడా పోలీసులు భారీ ఎత్తున విధులు నిర్వహిస్తున్నారు. పరిస్థితి ఇలా ఉండగా విధులు నిర్వహణలో పక్షపాతం చూపించే అధికారులపై ఎలక్షన్ కమిషన్ వేటు కూడా వేస్తూ ఉంది. దీంతో ప్రజలు ఎవరికి వారు ఉత్సాహంగా పోలింగ్ లో పాల్గొంటున్నారు.
ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలక్షన్ కమిషన్ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయడం జరిగింది. సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించి అక్కడ మరింతగా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇదిలా ఉంటే… టాలీవుడ్ సెలబ్రిటీలు భారీ ఎత్తున ఉదయమే తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సమేతంగా కిలో నిలబడి జూబ్లీహిల్స్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. విక్టరీ వెంకటేష్ కూడా ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. పోలింగ్ ప్రారంభం కాగానే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ సైతం క్యూలో నిలబడి ఓట్లు వేయడం జరిగింది. సాధారణ పౌరులు మాదిరిగా ఈ అగ్ర హీరోలు ఓటును వినియోగించుకోవడం జరిగింది.
జూనియర్ ఎన్టీఆర్ వెంట ఆయన సతీమణి లక్ష్మీ ప్రణతి, తల్లి శాలిని ఉన్నారు. వీళ్ళతోపాటు కీరవాణి కుటుంబ సభ్యులు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత మూడోసారి జరుగుతున్న ఈ అసెంబ్లీ ఎన్నికలలో… ఎవరు గెలుస్తారు అన్నది ఉత్కంఠ భరితంగా మారింది. మొదటి రెండుసార్లు కేసీఆర్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. అయితే మూడోసారి గెలుపు ఉత్కంఠ భరితంగా నెలకొంది.ఈసారి ప్రధాన పార్టీల మధ్య గట్టి పోటీ ఉన్నట్లు అనేక సర్వేలలో ఫలితాలు వచ్చాయి. ఇదే సమయంలో ప్రచారంలో ప్రధాన పార్టీల నాయకులు.. ప్రజలకు వరాలు లాంటి హామీలు కురిపించారు. దీంతో తెలంగాణ ప్రజలు ఏ పార్టీని ఆదరిస్తారు అన్నది ఆసక్తికరంగా నెలకొంది.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!