Madhuranagarilo March 18 2024 Episode 315: తప్పంతా నాదే అత్తయ్య మా అక్క మంచిది కాదనే శ్యామ్ సార్ చెప్తూ ఉన్న అర్థం చేసుకోకుండా తనమీద ఉన్న ప్రేమతో ఇక్కడికి తీసుకు వచ్చాను అది ఇలా చేస్తుందని నేను అసలు ఊహించలేదు దీనికంతటికి కారణం నేనే అని రాధా నిందించుకుంటుంది. రాధా నువ్వు అలా అనుకోకు అమ్మ మన తలరాత ఇలా ఉంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు చెప్పు అని మధుర అంటుంది. పండు లేకపోతే చచ్చిపోతాను అనడంతోశ్యామ్ సార్ ఆస్తినంతా అతనికి ఇచ్చేశాడు ఇదంతా నా వల్లే జరిగింది అని రాదా బాధపడుతుంది. రాధా నీ కన్నా మాకు ఆస్తి ఎక్కువ కాదు నువ్వుంటే చాలు అని శ్యామ్ అంటాడు. ఇంతలో మురళి నాగమణి అక్కడికి వస్తారు. వాళ్ల పరిస్థితిని చూసి బాధపడతారు.
రుక్మిణి పుట్టినరోజు గొంతులో వడ్ల గింజ వేసి చంపేసి ఉంటే మీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు అని నాగమణి అంటుంది. ఆ దుర్మార్గురాలు ఇంతటికి వడి కడుతుందని ఊహించలేకపోయాం అమ్మ అది చేసిన తప్పుకి మేము క్షమాపణ అడుగుతున్నాం దయచేసి మా ఇంటికి రండి అని మురళి అంటాడు.అన్నయ్య గారు మీరు ఆ మాట అన్నారు అదే చాలు కానీ నా కొడుకు కోడలు ఉండగా ఒకరి పంచన పడి ఉండాల్సిన కర్మ మకు లేదండి మమ్మల్ని క్షమించండి మా బరువు బాధ్యతలు మా కొడుకు కోడలు చూసుకుంటారు అని మధుర అంటుంది. మామయ్య ఆస్తి పోతే ఏంటి మా అమ్మ నాన్నని ఏ లోటు లేకుండా నేను చూసుకుంటాను మీరేమీ బెంగ పెట్టుకోకండి అని శ్యామ్ అంటాడు. బాధపడకుండా ఎలా ఉంటాం బాబు పుట్టాడు దుఃఖంలో ఉండి ఎటు వెళ్లాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు నా కూతురి ని నా వియ్యంకుడ్ని నా ఇంటికి తీసుకువెళ్లి పోషించుకోలేనా అని మురళి బాధపడతాడు.
నాన్న మేము పేదరికంలో అడుగుపెడుతున్నామని నువ్వు బాధపడకు ఆయన ఉన్నంతవరకు మాకు ఈ పేదరికం వల్ల ఏ ఇబ్బంది కలగదు శ్రీరాముడి వెంట వెళ్లిన సీతను చూసి జనక మహారాజు ఎంత ధైర్యంగా ఉన్నాడో ఆయన వెంట వెళ్తున్న నన్ను చూసి మీరు అంతే ధైర్యంగా ఉండండి అని రాధా వాళ్ళకి నచ్చా చెబుతుంది. అన్నయ్యగారు ఇంకా మీరు ఏమి ఆలోచించకండి మీరు ఏమి బెంగ పెట్టుకోకండి మేం బాగానే ఉంటాం వెళ్ళండి అని మధుర అంటుంది. నాగమణి మురళి వెళ్తూ ఉండగా ఇంతలో అక్కడికి రుక్మిణి వస్తుంది. కట్ చేస్తే, ఏంటి నాన్న ఈ ఇంటికి రేపు నేనే తీసుకొస్తాను అన్నాను కదా అప్పటిదాకా ఆగలేకపోయారా అని రుక్మిణి అంటుంది. ఇంకా ఆ పేదరికం ఇంట్లో ఉండలేక వచ్చారా పర్వాలేదులే రేపు నుంచి ఇంత పెద్ద ఇంట్లో మనం మాత్రమే ఉంటాం అని నాగమణి అంటుంది.నా కూతుర్ని అల్లుడ్ని ఆ ఇంటికి తీసుకు వెళ్దామని వచ్చాను అని నాగమణి అంటుంది. నువ్వు తీసుకువచ్చిన నేను వాళ్ళ మన ఇంట్లో ఉండనివ్వను అని రుక్మిణి అంటుంది.
చెప్పు తీసి కొడతాను మన ఇల్లు అంటే అది మా ఇల్లు రాదకి పుట్టినిల్లు శ్యామ్ కి అత్తవారిల్లు వాళ్ళు ఎప్పుడైనా వస్తారు నువ్వు మాత్రం మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని నాగమణి అంటుంది. అంతేకాదు మేము బ్రతికి ఉండగా నువ్వు ఆ ఇంటికి రావద్దు మేము చచ్చిపోయిన సరే నువ్వు మా శవాన్ని చూడడానికి కూడా రావద్దు అని మురళి అంటాడు. బావగారు ఎందుకు అలా అంటారు అని ధనంజయ్ అంటాడు. మీకు తెలియదు బావగారు నా పెద్ద కూతురుకి డబ్బు అనే జబ్బు న పడి చచ్చిపోయింది ఈరోజు అని బకెట్లో నీళ్లు తెచ్చుకొని తలారా స్నానం చేస్తాడు మురళి.
నాగమణి పద మన పెద్ద కూతురు చనిపోయింది దానికి జరిపించాల్సిన కర్మకాండలు చేయాలి అని మురళి నాగమణి తీసుకుని వెళ్ళిపోతాడు.కట్ చేస్తే,ఎంతో ఇష్టపడి కట్టుకున్న ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సి వస్తుంది ఆ రుక్మిణి స్వార్థం వల్ల అని మధుర బాధపడుతుంది. మధుర నువ్వే ఇలా కృంగిపోతే శ్యామ్ పరిస్థితి ఏంటి అని ధనంజయ్ అంటాడు. ఈరోజుతో మనకు ఇంటికి ఉన్న సంబంధం తెగిపోతుంది అని శ్యామ్ అంటాడు. రాధ మాత్రం వాళ్ళ అక్క చేసిన దుర్మార్గాన్ని తలుచుకుని బాధపడుతుంది.
ఇంతలో పండు వచ్చి అమ్మ ఈ ఒక్కరోజే మనం ఇంట్లో ఉంటామంట కదా రేపు ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతామంట కదా అని పండు అంటాడు. అవునా అన్న ఈ ఒక్కరోజు మాత్రమే మనం ఇంట్లో ఉండే అవకాశం ఉంది రేపు వేరే ఇంటికి వెళ్ళిపోతాం అక్కడ చాలా బాగుంటుంది అని రాదా అంటుంది. అమ్మ ఆ ఇంటికి పెద్దమ్మని రానివ్వకండి తను వస్తే అక్కడ కూడా మనల్ని బాధ పెడుతుంది అని పండు అంటారు. పండు మీ పెద్దమ్మ ఆ ఇంటికి రాదు రా అని శ్యామ్ అంటాడు. ఇల్లు వదిలిపెట్టి పోవాలని అందరి గుండెల్లో బాధ. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!