Madhuranagarilo March 4 2024 Episode 303: ఏంటి ఆలోచిస్తున్నావ్ ఉపవాసం ఉండలేవా నా మీద బోలెడంత ప్రేమ ఉంది కదా నీకు అని శ్యామ్ అంటాడు. అంటే కటిక ఊపువాసమా మామూలు ఉపవాసమా అని ఆలోచిస్తుందేమోరా అని మధుర అంటుంది. కటిక ఉపవాసం అంటే ఏంటి మామూలు ఉపవాసం అంటే ఏంటి అమ్మ అని శ్యామ్ అంటాడు. మామూలు ఉపవాసం అంటే పళ్ళు పాలు అల్పాహారం తీసుకుని ఉంటారు కటిక ఉపవాసం అంటే పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా రేపు ఉదయం పూజ పూర్తయ్య కా ఉపవాసం ఉంటారు అని మధుర చెబుతుంది. అవునా అయితే రాధ కూడా అదే ఉపవాసం ఉంటుంది అవును కదా రాధా అని శ్యామ్ అంటాడు. అవును నేను అదే ఉపాసన చేస్తాను మా అక్క కూడా మీకోసం కటిక ఉపవాసమే చేస్తుంది కదా అని రాదా అంటుంది.
అవును రాదా నేను కూడా కటిక ఉపాసమే చేస్తాను శ్యామ్ కోసం ఎందుకు చేయను అని రుక్మిణి అంటుంది. ఉపవాస దీక్ష సవ్యంగా పూర్తి కావాలని దేవుడికి దండం పెట్టుకో అక్క అని రాదా చెబుతుంది. రుక్మిణి దేవుడికి దండం పెట్టుకుంటుంది. కట్ చేస్తే, శ్యామ్ రుక్మిణికి ఇష్టమైన వంటలన్నీ రాద చేత వండిస్తాడు. ఎందుకండీ ఇవన్నీ వంటలు చేయించారు అని రాదా అడుగుతుంది. ఈ వంటలన్నీ మీ అక్కకి ఇష్టం కదా తను ఈ వంటల్ని చూసి ఉపవాస దీక్ష ఉంటుందో లేదంటే కడుపు నింపుకుంటుందో నువ్వే చూద్దువు గాని ఉండు మీ అక్కకి నామీద ఎంత ప్రేమ ఉందో బయటపడుతుంది కదా అని శ్యామ్ అంటాడు. సరే కూర్చోండి వడ్డిస్తాను అని రాదా అంటుంది. మధురవాళ్ళు దాక్షాయిని వాళ్ళు అందరూ వంటలు చాలా బాగున్నాయి ఈరోజు స్పెషల్ ఏంటి అని అడుగుతరు. ఏమీ లేదు అమ్మ నాకు ఇష్టమని వండించాను వచ్చి కూర్చోండి అని శ్యామ్ అంటాడు.
రాధా నువ్వు కూడా కూర్చో మీ అక్క ఎలాగూ ఉపవాసమే కదా తను వడ్డిస్తుందిలే అని శ్యామ్ రుక్మిణి పిలుస్తాడు. అక్కడికి వచ్చినా రుక్మిణికి ఆ వంటలని చూసి నోరు ఊరుతుంది. ఏంటండీ పిలిచారు అని రుక్మిణి అడుగుతుంది. ఏమి లేదు ఎలాగో నువ్వు ఉపవాసం తినవు కదా రాధ కూడా కూర్చుంటుంది నువ్వు వడ్డించు అని శ్యామ్ అంటాడు. నాకు ఇష్టమైనవి అన్ని వండుకొని మీరు హాయిగా తింటూ నన్ను వడ్డించమంటారా అని మనసులో అనుకుంటూ రుక్మిణి అందరికీ వడ్డిస్తుంది. వంటలు ఎంత బాగున్నాయి అమృతంగా ఉన్నాయి అంటూ అందరూ తింటారు. రుక్మిణి మాత్రం నేను తినలేకపోయానే అని మనసులో తిట్టుకుంటుంది. చూశారా సార్ మా అక్కకి మీరంటే ఎంత ప్రేమ తనకి ఇష్టమైనవన్నీ కళ్ళ ముందు ఉన్న తినకుండా నవ్వుతూ వడ్డిస్తుంది అని రాదా అంటుంది. పైకి నవ్వుతుంది కానీ తన మనసులో ఎన్ని తిట్టుకుంటుందో రాదా నన్ను అని శ్యామ్ అంటాడు.కట్ చేస్తే,డాక్టర్ మనోహర్ కి ఎలా ఉంది అని శ్యామ్ అంటాడు.
తను కోమాలో నుంచి బయటికి వస్తే కానీ ఏ సంగతి చెప్పలేమండి అని డాక్టర్ అంటాడు. ఇంతలో నర్సి వచ్చి సార్ పేషెంట్ కి స్పృహ వచ్చింది అని చెబుతుంది. చూద్దాం పదండి అn డాక్టర్ శ్యామ్ వాళ్ళు మనోహర్ దగ్గరికి వెళ్తారు. మళ్లీ మనోహర్ కోమలోకి వెళ్లిపోతాడు. మళ్లీ కోమలోకి వెళ్లిపోయాడు అని డాక్టర్ అంటాడు. అదేంటి డాక్టర్ ఒకసారి స్పృహలోకి వచ్చిన అతను మళ్ళీ కోమలో కి వెళ్లిపోవడమేంటి అని శ్యామ్ అంటాడు.ఇలా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుందండి ఒకసారి స్పృహలోకి వచ్చాడు అంటే తను రికవరీ అవుతాడు అని డాక్టర్ చెబుతాడు. కట్ చేస్తే, వాళ్లు కడుపునిండా తిని నా కడుపు మాత్రం మాడుస్తున్నారు ఉపవాసం పేరు చెప్పి వాళ్ళు ఎలాగూ తిన్నారు కదా ఏమైనా ఉంటే నేను అన్ని లాగించేస్తాను అంటు రుక్మిణి వెళ్లి చూసేసరికి గిన్నెలో ఏ ఒక్క వంట కూడా ఉండదు. అన్ని వాళ్లే తినేశారా అయితే నేను రెస్టారెంట్ కి వెళ్లి తినేస్తాను అని రుక్మిణి బయటికి వెళుతూ ఉండగా, రాధ వచ్చి ఎక్కడికి వెళ్తున్నావ్ అక్క అని అడుగుతుంది.
గుడికి వెళుతున్నాను రాదా అని రుక్మిణి చెబుతుంది. ఈ టైంలో గుడి ఉండదు కదా అక్క అని రాదా అంటుంది. ఏ గూడైనా తీసి ఉంటుందేమో చూసి అక్కడ కూర్చొని ఉపవాస దీక్ష పూర్తి చేద్దామని వెళుతున్నాను రాదా అని రుక్మిణి అంటుంది. గుడి తెరిచి ఉన్న నువ్వు వెళ్లడానికి వీల్లేదు అక్క ఇంట్లోనే ఉండి పూజ పూర్తి చేస్తామని మొక్కుకున్నాను అని రాదా ఒక పుస్తకం ఇచ్చి అందులో భగవంతుని నామాలు ఉన్నాయి అవి చదువుకుంటూ ఉపవాస దీక్షను పూర్తి చేయమని చెబుతుంది. చదువుకుంటూ దీక్ష పూర్తి చేస్తాను నీ పని నువ్వు చేసుకో అని రుక్మిణి చెబుతుంది. కట్ చేస్తే,
ఉపవాసం పేరు చెప్పి నన్ను రెస్టారెంట్ కి వెళ్ళనివ్వకుండా చేస్తారా నేను రెస్టారెంట్ కి వెళ్లకపోతేనే రెస్టారెంట్ ఇక్కడికి వచ్చింది అంటూ రుక్మిణి బర్గర్ తెప్పించుకొని తింటుంది. అది చూసిన శ్యామ్ రాద దగ్గరికి వెళ్లి మీ అక్క ఏం చేస్తుందో చూద్దువు గాని రా నామీద ప్రేమ ఉంది అన్నావు కదా అని తీసుకువస్తాడు రాదని. రుక్మిణి తింటూ ఉండగా శ్యామ్ రాధకి చూపెడతాడు. చూడు మీ అక్క ఏం చేస్తుందో అని శ్యామ్ అంటాడు. రుక్మిణి తింటూ ఉండగా రాదా కళ్ళతో చూసి షాక్ అవుతుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!