Supreme Court: అసెంబ్లీలోని ఎమ్మెల్యేలు, పార్లమెంట్ లోని ఎంపీలకు ..అవినీతి, లంచం కేసుల్లో విచారణ నుండి మినహాయింపు ఉండదని సుప్రీం కోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఈ మేరకు పివీ నరసింహరావు కేసులో నిందితులపై చర్యలు తీసుకోకుండా 1998 లో అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును కొట్టివేసింది.
ప్రసంగాలు, అసెంబ్లీ, పార్లమెంట్ లో ఓటు వేసేందుకు లంచాలు తీసుకున్నారన్న అరోపణలు ఎదుర్కొంటున్న చట్ట సభ్యులకు విచారణ నుండి మినహాయింపును ఇస్తూ 1998లో సుప్రీం కోర్టు తీర్పును ఇచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 105(2), 194(2) పార్లమెంటరీ ప్రివిలేజ్ ని పరిగణలోకి ఈ తీర్పును ఇస్తున్నట్లు నాటి ధర్మాసనం పేర్కొంది. అయితే .. ఈ తీర్పు అర్ధం లంచం తీసుకోవడం అనేది అర్టికల్ 105,194 లకు విరుద్దంగా ఉన్నాయని తాజాగా సుప్రీం కోర్టు అభిప్రాయపడింది.
ఈ మేరకు నాటి తీర్పును సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తులు జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ పీఎస్ నరసింహా, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం వెలువరించింది.
ఎంపీలు, ఎమ్మెల్యేలకు లంచం కేసుల్లో రాజ్యాంగ రక్షణ లేదు. లంచాలు తీసుకుని పార్లమెంట్, అసెంబ్లీలలో ప్రశ్నలు అడిగితే తప్పకుండా విచారణ ఎదుర్కవాల్సిందేనని ధర్మాసనం ఏకగ్రీవ తీర్పును వెల్లడించింది. చట్ట సభల్లో సభ్యులు లంచం తీసుకుని ప్రశ్నలు వేసినా ఇది వర్తిస్తుంది. శాసనసభ్యులు, ఎంపీలు లంచం తీసుకోవడం భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య పనితీరును నాశనం చేస్తొందని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు.
AP High Court: ఏపీ టెట్, డీఎస్సీ షెడ్యూల్ పై హైకోర్టు కీలక ఆదేశాలు