టాలీవుడ్ స్టార్ హీరోలు మహేష్, ఎన్టీఆర్, చరణ్ మంచి స్నేహితులు.. వీలున్న ప్రతిసారి ఈ స్టార్ హీరోలు వారి కుటుంబ సభ్యులతో సహా కలుసుకుని పార్టీలు చేసుకుంటూ ఉంటారు. లేదా ఏదో ఒక ప్రైవేట్ పార్టీలో కలుసుకుంటూ కూడా ఉంటారు. తాజాగా దర్శకుడు వంశీపైడిపల్లి శ్రీమతి మాలిని పుట్టినరోజు సందర్భంగా జరిగిన ప్రైవేట్ ఫంక్షన్లో మహేష్, ఎన్టీఆర్ వారి కుటుంబాలతో సహా కలుసుకుని ఎంజాయ్ చేశారు. ఈ ఫంక్షన్కు రాంచరణ్ మడమ గాయం కారణంగా హాజరు కాలేదు..వంశీ పైడిపల్లితో ఉన్న అనుబంధం కారణంగా.. మహేష్, ఎన్టీఆర్ ఈ ఫంక్షన్కు హాజరయ్యారు. మహేష్ శ్రీమతి నమ్రతా శిరోద్కర్ ఈ ఫోటోలను తన ఇసన్స్టా గ్రామ్ అకౌంట్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మహేష్, వంశీ పైడిపల్లి కలయికలో రూపొందుతోన్న `మహర్షి` మే 9న విడుదల కానుంది.
previous post
next post
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!