సూపర్స్టార్ మహేష్ 25వ చిత్రం `మహర్షి` ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని పలు థియేటర్స్ యాజమాన్యాలు టికెట్స్ ధరను పెంచుతున్నట్లు తెలిపారు. సింగిల్ స్క్రీన్స్లో 80 రూపాయల టికెట్ను 110 రూపాయలకు పెంచారు. అలాగే మల్టీప్లెక్స్ల్లో టికెట్ ధరలను రూ.50 పెంచుతున్నామని తెలిపారు. ప్రసాద్ ఐ మ్యాక్స్లో రూ. 138 ఉన్న టికెట్ ధరను రూ.200కి పెంచారు. ప్రభుత్వ అనుమతితోనే టికెట్స్ ధరను పెంచినట్లు తెలియజేశాయి థియేటర్స్ యాజమాన్యం. అయితే టికెట్స్ ధరల పెంపుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు. ఈ టికెక్స్ ధరలు రెండు వారాలు పెంపులోనే ఉంటాయి. అలాగే తెలంగాణ ప్రభుత్వం మే 9 నుండి 22 వరకు ఐదు షోలను ప్రదర్శించనున్నట్లు తెలిపారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!